కాకినాడ నగర పోరు నేడే | Today itself Kakinada Corporation Election | Sakshi
Sakshi News home page

కాకినాడ నగర పోరు నేడే

Aug 29 2017 1:37 AM | Updated on Aug 10 2018 8:27 PM

కాకినాడ నగర పోరు నేడే - Sakshi

కాకినాడ నగర పోరు నేడే

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికలకు నేడు పోలింగ్‌ జరగనుంది.

పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
 
కాకినాడ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికలకు నేడు పోలింగ్‌ జరగనుంది. మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు, ఇతర సామగ్రితో అధికారులు, సిబ్బంది 196 పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం బందోబస్తు ఏర్పాటు చేసింది. ప్రతిష్టాత్మక మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అధికార టీడీపీ, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి.

ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్సార్‌సీపీ, టీడీపీలు విస్తృత ప్రచారం నిర్వహించాయి. టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు  రెండు రోజులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక రోజు నగరంలో ప్రచారం నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, బీజేపీ నేత సోము వీర్రాజు తదితరులు సైతం నగరంలో పర్యటించారు.  మొత్తం 50 వార్డుల్లో 48 వార్డులకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా రెండు వార్డులకు కోర్టు వ్యాజ్యం మూలంగా ఎన్నికలు జరగడం లేదు. కాగా ఓట్ల లెక్కింపు సెప్టెంబరు 1వ తేదీన జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement