ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం | Three Babies Born in one Delivery YSR Kadapa | Sakshi
Sakshi News home page

ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం

Mar 23 2020 1:10 PM | Updated on Mar 23 2020 1:10 PM

Three Babies Born in one Delivery YSR Kadapa - Sakshi

ఎస్‌ఎన్‌సీయూలో ముగ్గురు శిశువులు

కడప అర్బన్‌:  రాజంపేట పట్టణానికి చెందిన  కాశీ విశ్వనాథ్‌ భార్య ప్రతిమ (26) అనే మహిళ ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చింది. ఆదివారం తెల్లవారుజామున కడప రిమ్స్‌లో ఆమె ప్రసవించింది. ఇందులో  ఆడశిశువులు కాగా, మరొకరు మగశిశువు ఉన్నారు.  ముగ్గురు శిశువుల్ని ప్రస్తుతం ఎస్‌ఎన్‌సియూ వార్డులో చిన్నపిల్లల విభాగం వైద్యనిపుణుల పర్యవేక్షణలోఉంచారు. తల్లి ప్రతిమ కాన్పుల వార్డులో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి తల్లితో పాటు, ముగ్గురు శిశువుల ఆరోగ్యపరిస్థితి బాగానే ఉందని డాక్టర్‌ కేశవచంద్ర తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement