►మొక్కుబడిగా సాక్షర భారత్ పరీక్షలు
►అన్నీ కాకి లెక్కలే..
చీరాల టౌన్ : దేశంలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు ప్రవేశపెట్టిన వయోజన విద్యా విధానం అమలు అపహాస్యంగా మారింది. దేశవ్యాప్తంగా ఆదివారం ఎన్ఐఓఎస్(నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్స్ స్కూలింగ్) అక్షరాస్యతా పరీక్ష నిర్వహించారు. చీరాల నియోజకవర్గంలోని చీరాల, వేటపాలెం మండలాల్లో 268 మంది పరీక్ష రాయవలసింది. అయితే ఈ పరీక్షలు మొక్కుబడిగా కొనసాగాయి.
నియోజకవర్గంలోని 24 గ్రామ పంచాయతీల్లోని వయోజన విద్యాకేంద్రాల్లో 268 మందికిగాను 218 మంది మాత్రమే రాశారు. కొన్ని పంచాయతీల్లోని పరీక్షను మొక్కుబడిగా నిర్వహించగా మరికొన్ని చోట్ల అసలు వయోజన విద్యాకేంద్రాల్లో పరీక్షలే నిర్వహించలేదు. ఆయా గ్రామ పంచాయతీల సాక్షర భారత్ కోఆర్డినేటర్లు మొక్కుబడిగా జవాబు పత్రాలు నింపి, పరీక్షలు రాసినట్లు లెక్కలు చూపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
కొన్ని చోట్ల సాక్షర భారత్ పరీక్షను నిర్వహించకుండానే నిర్వహించినట్లు రికార్డుల్లో నమోదు చేయడం గమనార్హం. వీటిని పర్యవేక్షించాల్సిన గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఇన్విజిలేటర్లుగా వ్యవహరించాల్సిన అంగన్వాడీ టీచర్లు పత్తాలేకుండా పోయారు. గ్రామ కోఆర్డినేటర్లు రాసిన పేపర్లకు అంగన్వాడీ ఇన్విజిలేటర్ల పర్యవేక్షణలో ఆమోదం తెలిపి అన్నీ సక్రమమే అని తేల్చేశారు. నిరక్ష్యరాస్యులకు విద్యను బోధించాల్సిన కోఆర్డినేటర్లు.. చదువుకున్న వారితో పరీక్షలు రాయించి మమ అనిపిస్తున్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన మండల, జిల్లా కోఆర్డినేటర్లు మాత్రం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా వయోజనా విద్యా కార్యక్రమ లక్ష్యం నీరుగారుతోంది. వయోజనులకు విద్య దూరమవుతోంది.
ఎన్ఐఓఎస్ పరీక్షకు 218 మంది హాజరు
చీరాల టౌన్ : వయోజన విద్యా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన నేషనల్ ఓపెన్ స్కూల్ పరీక్షకు చీరాల నియోజకవర్గంలో 218 మంది హాజరయ్యారు. చీరాల మండలంలో 209 మందికిగాను 189 అభ్యాసకులు పరీక్ష రాసినట్లు సాక్షర భారత్ మండల కోఆర్డినేటర్ జి.జగన్మోహన్రావు తెలిపారు. వేటపాలెం మండలంలోని 57 మందికిగాను 29 మంది అభ్యాసకులు పరీక్షకు హాజరయ్యారని మండల కోఆర్డినేటర్ టి.ఎఫ్రాయిం తెలిపారు.
అక్షరం అపహాస్యం
Published Mon, Aug 21 2017 4:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement