► ఉచిత విధానంతో విచ్చలవిడిగా వెలుస్తున్న డంప్లు
► అందినకాడికి దోచేసుకుంటున్న
► అధికార పార్టీ నేతలు, రియల్టర్లు
► సాధారణ ప్రజలకు దొరికేది కష్టమే
► పట్టించుకోని అధికారులు
సాక్షి ప్రతినిధి, కర్నూలు : దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకుందామన్న చందంగా అధికార పార్టీ నేతలు.. రియల్టర్లు ఉచిత ఇసుకను దోచేసుకుంటున్నారు వందల కొద్దీ ట్రాక్టర్ల ఇసుకను డంప్ చేసుకుంటున్నారు. ఉచిత ఇసుక విధానం అమలులోకి వచ్చినప్పటి నుంచి భారీ స్థాయిలో ట్రాక్టర్లను రంగంలోకి దించి దర్జాగా ఇసుకను డంప్ చేసుకుంటున్నారు. అయినా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మరోవైపు ప్రస్తుతం ఉన్న ఇసుక నిల్వలు కేవలం 9 నెలలకే సరిపోతాయనే అంచనాలు సాధారణ ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది.
డంప్లే.. డంపులు
ఏ రోజు అవసరాలకు ఆ రోజే ఇసుకను సరఫరా చేసుకోవాలని అలా కాకుండా అక్రమంగా నిల్వ చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినా అధికార పార్టీ నేతలు, రియల్ ఎస్టేట్ సంస్థల వారు ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఎక్కడ చూసినా ఇసుక మేటలు వేస్తోంది. ఇప్పటికే ఆలూరు సమీపంలో ఒక ప్రైవేట్ పవన విద్యుత్ ప్లాంట్తో పాటు మంత్రాలయంలో శ్రీమఠం అధికారులు ఇసుకను భారీ స్థాయిలో డంపు చేసినట్టు ఆధారాలతో సహా ‘సాక్షి’ బయటపెట్టింది. అలాగే చాలాచోట్ల అధికారపార్టీ నేతలు, రియల్ ఎస్టేట్ సంస్థలు భారీగా ఇసుకను డంప్ చేసినట్లు తెలుస్తోంది. వందల ట్రాక్టర్ల ఇసుకను రాత్రనక... పగలనక తవ్వుకుంటూ డంప్ చేస్తున్నారు. కంటి చూపు మేరలో ఇసుక డంప్లు దర్శనమిస్తున్నా అధికారులు మాత్రం అటువైపు చూసేందుకు సాహసించడం లేదు. ఉన్న కొద్దిపాటీ ఇసుక నిల్వలను ఈ విధంగా డంప్ చేసుకుంటూ పోతే మరికొద్ది రోజుల్లో సాధారణ ప్రజలకు ఇంటి నిర్మాణానికి కూడా ఇసుక లభించే పరిస్థితి లేకుండా పోతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
9 నెలలకే ఖలాస్
జిల్లాలో మొత్తం నాలుగు ఇసుక రీచ్లు ఉన్నాయి. ఇందులో కర్నూలు మండలంలోని ఆర్. కొంతలపాడు, పుడూరు, నందవరం మండలంలోని గురజాలతో పాటు పత్తికొండ నియోజకవర్గంలో కనకలదిన్నెలో రీచ్లు ఉన్నాయి. ఈ నాలుగు రీచ్లలో ఉన్న ఇసుక నిల్వలు కేవలం 3 లక్షల క్యూబిక్మీటర్లు మాత్రమే. గతంలో రాయల్టీ విధానం అమలులో ఉన్న సమయంలోనే ఏడాది కాలంలోనే ఏకంగా 4 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను జిల్లా ప్రజలు కొనుగోలు చేశారు. అంటే ప్రస్తుతం ఉన్న ఇసుక నిల్వలు కేవలం 9 నెలలకు మించి సరిపోయే అవకాశం లేదు. ఆ తర్వాత జిల్లాలో ఇసుక దొరికే అవకాశమే లేదనే అభిప్రాయం నెలకొంది.
కొత్త రీచ్లకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నుంచి అనుమతులు లభించడం లేదు. దీంతో ఈ రీచ్లల్లో ఇసుకను తవ్వేందుకు అవకాశం లభించడం లేదు. ఇక ఇతర ప్రాంతాల్లో మరికొన్ని కొత్త రీచ్లకు అనుమతి ఇచ్చేందుకు స్థానికం భూగర్భ జలవనరులశాఖ అధికారులు అంగీకరించడం లేదు. అలాచేస్తే భూగర్భ నీటి నిల్వలు మరింత ప్రమాదకర స్థాయికి తరిగిపోతాయని వారు ఆందోళన చెందుతున్నారు.
ఇసుక.. మస్కా
Published Thu, Apr 21 2016 4:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
తప్పక చదవండి
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement