మళ్లీ మళ్లీ చెప్పాలా? విశాఖ ఎంపీ టిక్కెట్ నాదే | T. Subbarami Reddy reiterates desire to contest from Vizag MP seat | Sakshi
Sakshi News home page

మళ్లీ మళ్లీ చెప్పాలా? విశాఖ ఎంపీ టిక్కెట్ నాదే

Sep 11 2013 12:25 PM | Updated on Mar 18 2019 9:02 PM

మళ్లీ మళ్లీ చెప్పాలా? విశాఖ ఎంపీ టిక్కెట్ నాదే - Sakshi

మళ్లీ మళ్లీ చెప్పాలా? విశాఖ ఎంపీ టిక్కెట్ నాదే

వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీ టిక్కెట్ తనదేనని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి మరోసారి పునరుద్ఘాటించారు.

నెల్లూరు:  వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీ టిక్కెట్ తనదేనని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి మరోసారి పునరుద్ఘాటించారు. బుధవారం నెల్లూరులో విలేకర్లు అడిగిన ప్రశ్నకు అసహనం వ్యక్తం చేసిన ఆయన మళ్లీ మళ్లీ చెప్పాలా? ఈసారి విశాఖ ఎంపీ టిక్కెట్ తనదేని వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ సంవత్సరం తన పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకుంటున్నట్లు సుబ్బరామిరెడ్డి తెలిపారు.

గత కొన్నాళ్లుగా విశాఖ పట్నం టికెట్ కోసం పట్టుబడుతున్న ఆయన తాజాగా  మరోసారి విశాఖ ఎంపీ సీటుపై తన మనసులో మాటను బయటపెట్టారు. ఎలాగయినా విశాఖ సీటును ఈ సారి కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న సుబ్బరామిరెడ్డి అవకాశం వచ్చినప్పుడల్లా దాని గురించే మాట్లాడటం విశేషం. రాబోయే ఎన్నికలలో విశాఖ నుండి లోక్సభకు పోటీ చేయాలని ఆయన పరితపిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కేంద్రమంత్రి పురందేశ్వరి విశాఖ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement