సెప్టెంబర్‌ 23 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు | Srivari Brahmotsavam from September 23 | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌ 23 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Aug 19 2017 12:56 AM | Updated on Sep 17 2017 5:40 PM

సెప్టెంబర్‌ 23 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

సెప్టెంబర్‌ 23 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్‌ 23 నుంచి అక్టోబర్‌ 1 వరకు జరగనున్నాయి.

27న రాత్రి 7.30 గంటలకు గరుడసేవ
 
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్‌ 23 నుంచి అక్టోబర్‌ 1 వరకు జరగనున్నాయి. ఇందుకోసం టీటీడీ సమాయత్తమవుతోంది. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై  టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు ఇప్పటికే దృష్టిసారించారు. పుష్కరిణి నీటిని తొలగించి శుద్ధి పనులు చేస్తున్నారు.

ఇక బ్రహ్మోత్సవాల అనుబంధ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్‌ 27వ తేది రాత్రి 7.30 గంటలకు శ్రీవారి గరుడవాహన సేవ ప్రారంభించనున్నారు.  ఈసారి ఉత్సవాల్లో కొత్త సర్వభూపాల వాహనం వాడనున్నారు. సెప్టెంబర్‌ 6న పౌర్ణమి గరుడవాహన సేవను మాదిరి బ్రహ్మోత్సవ గరుడవాహన సేవగా నిర్వహించి లోటుపాట్లు గుర్తించి, సవరించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement