
బొమ్మూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి
తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 16వ నెంబర్ జాతీయ రహదారిపై బొమ్మూరు వద్ద ఆగి ఉన్న లారీని టవేరా కారు ఢీకొట్టింది. ఆ ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు భవానీ భక్తులు కూడా ఉన్నారు. మృతులంతా విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
విశాఖ నుంచి విజయవాడకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా సమాచారం. ప్రమాద స్థలంలో ఐదుగురు మృతి చెందారు. హస్పటల్కు తరలిస్తుండగా మరోకరు మరణించారు. పొగమంచు కారణంగానే ప్రమాదం చోటు చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.