బొమ్మూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి | Six people killed in road accident at bommuru in east godavari district | Sakshi
Sakshi News home page

బొమ్మూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

Oct 15 2013 8:29 AM | Updated on Nov 6 2018 4:55 PM

బొమ్మూరు వద్ద  ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి - Sakshi

బొమ్మూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 16వ నెంబర్ జాతీయ రహదారిపై బొమ్మూరు వద్ద ఆగి ఉన్న లారీని టవేరా కారు ఢీకొట్టింది. ఆ ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు భవానీ భక్తులు కూడా ఉన్నారు. మృతులంతా విశాఖపట్నంలోని  గాజువాక ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

 

విశాఖ నుంచి విజయవాడకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా సమాచారం. ప్రమాద స్థలంలో ఐదుగురు మృతి చెందారు. హస్పటల్కు తరలిస్తుండగా మరోకరు మరణించారు. పొగమంచు కారణంగానే ప్రమాదం చోటు చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement