నీలకంఠాపురంలో రఘువీరారెడ్డి ఇల్లు ముట్టడి | Seemandhra Activists attack on Raghuveera Reddy House | Sakshi
Sakshi News home page

నీలకంఠాపురంలో రఘువీరారెడ్డి ఇల్లు ముట్టడి

Sep 22 2013 2:15 PM | Updated on Sep 1 2017 10:57 PM

నీలకంఠాపురంలో రఘువీరారెడ్డి ఇల్లు ముట్టడి

నీలకంఠాపురంలో రఘువీరారెడ్డి ఇల్లు ముట్టడి

మంత్రి రఘువీరా రెడ్డికి సమైక్యాంధ్ర సెగ తగిలింది.

అనంతపురం: మంత్రి రఘువీరా రెడ్డికి  సమైక్యాంధ్ర సెగ తగిలింది. నీలకంఠాపురంలోని ఆయన ఇంటిని   సమైక్యవాదులు  ముట్టడించారు. రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు.

 సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎంపీల వైఖరికి నిరసనగా మడకశిరలో ఉపాధ్యాయులు చెవిలో పూలతో నిరసన తెలిపారు. మంత్రి రఘువీరా రెడ్డిని అడ్డుకునేందుకు మడకశిర నుంచి నీలకంఠాపురం వెళుతున్న ఉద‌్యోగులు, ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనగా సమైక్యవాదులు  రోడ్డుపై బైఠాయించారు.   దాంతో మడకశిరలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

Advertisement
 
Advertisement
Advertisement