23,24 తేదీల్లో ఢిల్లీలో సచివాలయ ఉద్యోగుల దీక్ష | Secretariat employees hunger strike in Delhi on 23rd and 24th | Sakshi
Sakshi News home page

23,24 తేదీల్లో ఢిల్లీలో సచివాలయ ఉద్యోగుల దీక్ష

Sep 15 2013 3:29 PM | Updated on Sep 1 2017 10:45 PM

సమైక్య రాష్ట్రం కోసం ఈ నెల 23,24 తేదీల్లో ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద దీక్ష చేపడతామని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం అధ్యక్షుడు మురళీ కృష్ణ చెప్పారు.

గుంటూరు: సమైక్య రాష్ట్రం కోసం ఈ నెల 23,24 తేదీల్లో  ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద దీక్ష చేపడతామని  సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల  ఫోరం అధ్యక్షుడు మురళీ కృష్ణ చెప్పారు.  300 మంది సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఈ దీక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  

సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ వేగం తగ్గిందని చెప్పారు.  విభజన వల్ల దేశం వినాశనం అవుతుందన్న  ఇందిరాగాంధీ మాటను  ఏఐసిసి అధ్యక్షురాలు  సోనియా గాంధీ  పట్టిచ్చుకోవడంలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement