'తెలంగాణలో కాంగ్రెస్ ఆత్మహత్య చేసుకున్నట్లే' | Sangareddy mla Turpu Jayaprakash Reddy supports united andhra pradesh | Sakshi
Sakshi News home page

'తెలంగాణలో కాంగ్రెస్ ఆత్మహత్య చేసుకున్నట్లే'

Jan 13 2014 2:46 PM | Updated on Sep 27 2018 5:59 PM

సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి మరోసారి సమైక్య గళం విప్పారు. తాను ఇప్పటికీ సమైక్యవాదినే అని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్ : సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి మరోసారి సమైక్య గళం విప్పారు. తాను ఇప్పటికీ సమైక్యవాదినే అని ఆయన స్పష్టం చేశారు.  రాష్ట్ర విభజన తర్వాత విలీనం కాకుండా టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే కొందరు కాంగ్రెస్ నేతలు ఆపార్టీలోకి వెళ్లే అవకాశం ఉందన్నారు. టీఆర్ఎస్ విలీనం కాకుంటే కాంగ్రెస్కు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ఆత్మహత్య చేసుకున్నట్లేనని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. విభజన వల్ల సామాన్యుడికి ఒరిగేది ఏమీ లేదని... జరిగేది రాజకీయ విభజనే అని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement