‘ఈఎస్‌ఐ’ వేతన పరిమితి రూ. 25 వేలు | Salary cap raised for availing ESI benefits | Sakshi
Sakshi News home page

‘ఈఎస్‌ఐ’ వేతన పరిమితి రూ. 25 వేలు

Oct 25 2013 2:40 AM | Updated on Sep 4 2018 5:07 PM

ఈఎస్‌ఐ ఆస్పత్రిలో సేవలు పొందేందుకు గాను ఉద్యోగుల వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచినట్టు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన సహాయ మంత్రి కె. సురేశ్ వెల్లడించారు.

సాక్షి, హైదరాబాద్: ఈఎస్‌ఐ ఆస్పత్రిలో సేవలు పొందేందుకు గాను ఉద్యోగుల వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచినట్టు  కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన సహాయ మంత్రి కె. సురేశ్ వెల్లడించారు. కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో నజన్‌గుడ్‌లో ఈఎస్‌ఐ ప్రాంతీయ వైద్య విభాగం, డయాగ్నాస్టిక్ కేంద్రాల నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం, రామనగర జిల్లాలోని చెన్నపట్నలో ఈఎస్‌ఐ ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈఎస్‌ఐలో సేవలను మరింతగా పెంచనున్నట్టు చెప్పారు. వేతన పరిమితిని రూ.25 వేలకు పెంచినట్టు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement