ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి మృతి | RTC bus, bike collusion: young person died | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి మృతి

Oct 26 2013 3:48 AM | Updated on Sep 1 2017 11:58 PM

ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది.

 అశ్వాపురం, న్యూస్‌లైన్: ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలోని కందుల పుల్లయ్య ఫిల్లింగ్ స్టేషన్ యజమాని కందుల కృష్ణప్రణీత్(24) శుక్రవారం పెట్రోల్ బంకు నుంచి అశ్వాపురంలోని ఇంటికి ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. ఈ క్రమంలో మణుగూరు నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును క్రాస్ చేస్తుండగా ఎదురుగా లారీ వచ్చింది. దీంతో అతను వెనక్కు తగ్గుతున్న క్రమంలో పక్కనుంచి బస్సును ఢీకొన్నాడు. ఈ ఘటనలో కిందపడిన అతనికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108లో అతనిని గౌతమీనగర్ కాలనీలోని భారజల ఉద్యోగుల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. కృష్ణప్రణీత్ మృతితో అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగియపోయారు.  ఈ విషయం తెలుసుకున్న గ్రామంలోని ప్రముఖులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు ఆస్పత్రి వద్దకు చేరుకుని మృతదేహాన్ని సందర్శించి వారి కుటుంబానికి సానుభూతిని వ్యక్తంచేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement