ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి అధికారులను ఆదేశించారు.
సాక్షి, హైదరాబాద్: ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూశాఖపై శుక్రవారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహణకు ఎజెండా రూపొందించాలని సూచించారు. కాగా, ఏడో విడత భూపంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 10వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టుల రాతపరీక్ష ముందుగా నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరి రెండో తేదీనే జరుగుతుందని రఘువీరా స్పష్టం చేశారు.