విజయనగరం క్రైం: కేంద్రమంత్రి, టీడీపీలో సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు సమక్షంలో విజయనగరం మున్సిపల్ చైర్మన్పై కౌన్సిలర్లు, పార్టీ నాయకులు తిరుగుబావుటా ఎగురవేశారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో కేంద్రమంత్రి అశోక్గజపతిరాజు ఆధ్యక్షతన విజయనగరం మున్సిపాలిటీకి సంబంధించిన సీనియర్నాయకులు, కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులతో ఆదివారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణను లక్ష్యంగాచేసుకుని కౌన్సిలర్లు, పార్టీ నాయకులు విమర్శలు గుప్పించారు. మున్సిపాలిటీ జరిగే ఓ ఒక్కకార్యక్రమాన్నీ చైర్మన్ తెలియపరచడంలేదని.. కనీసం సమాచారం లేకుండా పనులు చేస్తున్నారని కొందరు కౌన్సిలర్లు, పార్టీనాయకులు ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీలో కొన్ని పనులు సభ్యుల అనుమతిలేకుండా జరిపిస్తున్నారని, అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిని వెనుకేసుకు వస్తున్నారని అశోక్దృష్టికి తీసుకు వెళ్లారు.
పింఛన్ ఎంపికల్లో ఎక్కువగా అక్రమాలు జరిగాయని, అర్హులకు అన్యాయం జరిగిందని, ఈవిషయాన్ని చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని మరి కొందరు ఆవేదన వెళ్లగక్కారు. పింఛన్లలో తప్పుడుగా నమోదు చేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్ల విషయంలో చైర్మన్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని,ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని కౌన్సిలర్లు, పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. మున్సిపాలిటీలో ఎటువంటిఅభివృద్ధి పనులూ చేయకపోవడం వల్ల వార్డుల్లో తిరగలేక పోతున్నామని, కౌన్సి లర్ల ఇంటిపైకి ప్రజలు వస్తున్నారని అశోక్దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలకు సమా చారం లేకుండా చేస్తున్నారని చెప్పారు. వార్డు అధ్యక్షులకు తెలియకుండా పట్టణంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అలాంటపుడు అధ్యక్షులుగా ఎందుకు నియమించారని అశోక్ దృష్టికి తీసుకువెళ్లారు.
సమస్యలన్నీ సావధానంగా విన్న కేంద్రమంత్రి అశోక్గజపతిరాజు పట్టణంలో జరిగే కార్యక్రమాలు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, వార్డు అధ్యక్షులకు సమాచారం ఇవ్వాలని చైర్మన్కు చురకలు అంటించినట్లు సమాచారం. ఇకముందు జరిగే ప్రతి కార్యక్రమాన్ని పట్టణ పార్టీ అధ్యక్షుడు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులకు తెలిపి..వారందరితో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని చైర్మన్కు అశోక్ సూచించినట్లు తెలుస్తోంది. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ శోభాస్వాతిరాణి, విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ .రాజు, తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు కర్రోతు వెంకటనరసింగరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ,పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మ న్యాల కృష్ణ, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు.
ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న వారికిఅశోక్క్లాస్..?
అశోక్బంగ్లాలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న వారికి కేంద్రమంత్రి అశోక్గజపతిరాజు ప్రత్యేక క్లాసు ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. సమావేశంలో అందరిమధ్య క్లాసు ఇస్తే బాగోదన్న ఉద్దేశంతో వారికి అశోక్ ప్రత్యేక క్లాస్ ఇవ్వనున్నట్లు సమాచారం.
తిరుగుబావుటా..
Published Mon, Dec 15 2014 2:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement