ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు టైర్లకు మంటలు | Private Travels fires in bus tires | Sakshi
Sakshi News home page

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు టైర్లకు మంటలు

Mar 26 2018 11:57 AM | Updated on Sep 5 2018 9:47 PM

Private Travels fires in bus tires - Sakshi

ప్రమాదానికి గురైన ట్రావెల్‌ బస్సు

కృష్ణా జిల్లా : కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు టైర్లకు మంటలు అంటుకున్నాయి. టోల్‌ ప్లాజా సిబ్బంది గమనించి డ్రైవర్ను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు ముంబాయి నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. బస్సును నిలిపివేసి అక్కడ ఉన్న సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

 పెను ప్రమాదం తప్పడంతో బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే మరో బస్సు ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా స్థానిక ఎమ్మార్వో పద్మజ తగు జాగ్రత్తలు తీసుకున్నారు. రాపిడి వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement