'విశాఖ ఉత్సవ్ను వాయిదా వేయండి' | Sakshi
Sakshi News home page

'విశాఖ ఉత్సవ్ను వాయిదా వేయండి'

Published Thu, Jan 22 2015 4:10 PM

postpone vishaka ustav, ap doctors comittee demand

 విశాఖపట్నంలో రేపటి నుంచి జరగనున్న విశాఖ ఉత్సవ్ను తాత్కాలికంగా వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ డాక్టర్ల సంఘం డిమాండ్ చేసింది. తెలంగాణతో పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో స్వైన్ఫ్లూ కేసులున్నాయని ఏపీ డాక్టర్ల సంఘం సెక్రటరీ డాక్టర్ శ్యామ్సుందర్ చెప్పారు. విశాఖ ఉత్సవ్లో భారీసంఖ్యలో ప్రజలు పాల్గొంటారు, దాంతో స్వైన్ఫ్లూ వ్యాధి సులువుగా వ్యాప్తి చేందే అవకాశం ఉందని ఏపీ డాక్టర్ల సంఘం ఈ నిర్ణయం తీసుకుందని శ్యామ్సుందర్ వివరించారు.

Advertisement
Advertisement