ప్రొద్దుటూరులో రూ. 46 లక్షలు పట్టివేత | Police Seized Rs. 60 Lakhs at TDP MLA Candidate relatives mill in Proddutur town | Sakshi
Sakshi News home page

ప్రొద్దుటూరులో రూ. 46 లక్షలు పట్టివేత

Apr 29 2014 8:46 AM | Updated on Aug 14 2018 5:54 PM

ప్రొద్దుటూరులో రూ. 46 లక్షలు పట్టివేత - Sakshi

ప్రొద్దుటూరులో రూ. 46 లక్షలు పట్టివేత

వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ బంధువులకు చెందిన మిల్లుపై మంగళవారం ఉన్నతాధికారులు దాడులు నిర్వహించారు.

వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ బంధువులకు చెందిన శ్రీకర్ జిన్నింగ్ మిల్లుపై మంగళవారం ఉన్నతాధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా మిల్లులో ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన భారీ నగదును ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకుని... అదాయపు పన్నుశాఖకు అప్పగించారు. ఉన్నతాధికారుల కథనం ప్రకారం... ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఓటర్లకు పంచేందుకు భారీ మొత్తంలో తీసుకువచ్చిన నగదును ఆయన బంధువుల మీల్లులో ఉంచినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

దాంతో పోలీసులు, ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు మంగళవారం ఉదయం సంయుక్తంగా సుధాకర్ యాదవ్ బంధువుల మిల్లుపై దాడులు చేశారు. ఆ క్రమంలో రూ. 46.19 లక్షలు నగదును స్వాధీనం చేసుకుని...అదాయపు పన్ను శాఖకు అప్పగించారు.  ఈ పట్టుబడిన నగదుపై పోలీసులు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement