విశాఖలో భాగస్వామ్య సదస్సు: గంటా | partnership summit in visakhapatnam, says Ganta Srinivasa rao | Sakshi
Sakshi News home page

విశాఖలో భాగస్వామ్య సదస్సు: గంటా

Jan 8 2016 3:47 PM | Updated on May 3 2018 3:17 PM

ఈ నెల 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఐఐ సహకారంతో భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఐఐ సహకారంతో ఈ నెల 10వ తేదీ నుంచి విశాఖపట్నం నగరంలో భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ సదస్సు ప్రాంతంలో ఏపీ తాత్కాలిక సచివాలయం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సదస్సు తర్వాత ఏపీ నైసర్గిక స్వరూపం మారే అవకాశం ఉందని గంటా ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సదస్సు సందర్భంగా ఏపీ ప్రభుత్వంతో రూ. 1 నుంచి 2 లక్షల కోట్లు ఎంఓయూ జరిగే అవకాశం ఉందని గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రులు జైట్లీ, వెంకయ్య, నిర్మలా సీతారామన్, రాజీవ్ ప్రతాఫ్ రూడీసహా 1200 మంది ప్రతినిధులతోపాటు 350 మంది విదేశీ ప్రతినిధులు హాజరవుతారని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.ఈ సదస్సు 12వ తేదీతో ముగుస్తుందని  గంటా శ్రీనివాసరావు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement