బైక్ ను ఢీకొన్న ట్రాక్టర్: వ్యక్తి మృతి | one died in tractor and bike collisioned incident | Sakshi
Sakshi News home page

బైక్ ను ఢీకొన్న ట్రాక్టర్: వ్యక్తి మృతి

Mar 19 2016 7:27 AM | Updated on Sep 3 2017 8:08 PM

నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగు వద్ద ఉన్న ఏషియన్ పెయింట్ షాపు వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు.

కోవూరు: నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగు వద్ద ఉన్న ఏషియన్ పెయింట్ షాపు వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఇరిగేషన్ కాలువ పనుల్లో జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్(30) అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. దాంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు నెల్లూరు జిల్లా కోట గ్రామానికి చెందినవాడు. ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement