ఉద్యమంపై ఎన్నికల ప్రభావం ఉండదు:అశోక్ బాబు | No election effect on the movement: Ashokbabu | Sakshi
Sakshi News home page

ఉద్యమంపై ఎన్నికల ప్రభావం ఉండదు

Dec 25 2013 4:41 PM | Updated on Sep 2 2017 1:57 AM

అశోక్ బాబు

అశోక్ బాబు

సమైక్యాంధ్ర ఉద్యమంపై ఏపిఎన్జిఓ సంఘం ఎన్నికల ప్రభావం ఉండదని ఆ సంఘం తాత్కాలిక అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు.

శ్రీకాకుళం: సమైక్యాంధ్ర ఉద్యమంపై ఏపిఎన్జిఓ సంఘం ఎన్నికల ప్రభావం ఉండదని ఆ సంఘం తాత్కాలిక అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. ఎన్నికల కారణంగా సమైక్య ఉద్యమం పక్కతోవ పట్టలేదన్నారు. ఏపిఎన్జిఓ సంఘం ఎన్నికలలో ఎవరు గెలిచినా సమైక్యరాష్ట్ర ఉద్యమం తీవ్రంగా ఉంటుందని చెప్పారు.

ఏపీఎన్‌జీవోల సంఘం ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఆదివారంతో పూర్తయిన విషయం తెలిసిందే. ప్రస్తుత తాత్కాలిక కమిటీ అధ్యక్షుడు అశోక్‌బాబు, పలువురు సభ్యులు తిరిగి నామినేషన్లు దాఖలు చేశారు. అశోక్‌బాబు ప్యానెల్‌కు వ్యతిరేకంగా ఏపీఎన్‌జీవోల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బషీర్ నేతృత్వంలో మరో ప్యానెల్ బరిలోకి దిగింది. మొత్తం 17 మందితో ఒక్కో ప్యానెల్ ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement