నేటి నుంచి మిషనరీ స్కూళ్లకు సెలవులు | missionary schools holidays from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి మిషనరీ స్కూళ్లకు సెలవులు

Dec 22 2013 1:30 AM | Updated on Sep 4 2018 5:07 PM

రాష్ట్రంలోని క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు ఈ నెల 22 నుంచి జనవరి ఒకటో తేదీ వరకూ క్రిస్మస్ సెలవులను విద్యా శాఖ ప్రకటించింది.

తెలంగాణలో జనవరి ఒకటి వరకూ..
    సీమాంధ్రలో క్రిస్మస్ రోజుకే పరిమితం


 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు ఈ నెల 22 నుంచి జనవరి ఒకటో తేదీ వరకూ క్రిస్మస్ సెలవులను విద్యా శాఖ ప్రకటించింది. రెండో తేదీన ఈ పాఠశాలలు తిరిగి ప్రారంభమౌతాయి. అయితే తెలంగాణ జిల్లాల్లో ఈ నెల 22 నుంచి జనవరి ఒకటి వరకు సెలవులు వర్తిస్తుండగా.. సీమాంధ్ర జిల్లాల్లో మాత్రం క్రిస్మస్ పండుగ రోజున మాత్రమే సెలవు వర్తిస్తుంది. సమైక్య ఉద్యమం సందర్భంగా సీమాంధ్రలో ఉపాధ్యాయులు సమ్మె చేసినందున స్కూళ్లు పనిచేయలేదు. ఈ నేపథ్యంలో ఆ సెలవు దినాలను సర్దుబాటు చేయడంలో భాగంగా సీమాంధ్ర జిల్లాల్లో క్రిస్మస్ పండుగ రోజు మినహా మిగిలిన రోజుల్లో మిషనరీ పాఠశాలలు పనిచేసేలా విద్యాశాఖ సర్దుబాటు చేసింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement