కర్నూలు రూరల్, న్యూస్లైన్ : తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) చివరి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించడం కోసం తలపెట్టిన గురురాఘవేంద్ర ప్రాజెక్టు, పులకుర్తి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం మైనర్ ఇరిగేషన్ పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇప్పటికే పనిభారంతో సతమతమవుతున్నామంటూ మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ ఆ పనుల బాధ్యతలు తీసుకునేందుకు ససేమిరా ఒప్పుకోవడం లేదు. దీంతో పర్యవేక్షణ విషయం త్రిశంకు స్వర్గంలో పడడంతో పనులు నిలిచిపోయాయి. గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు 14 ఏళ్ల క్రితం పునాది రాయి పడినప్పటికీ ఇప్పటికీ 60శాతం పనులు కూడా పూర్తికాలేదు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం సర్కిల్-1 సూపరెండెంట్ పర్యవేక్షణలో ఐదేళ్లు దాటినా పనుల విషయంలో పురోగతి లేకపోవడంతో భారీ నీటిపారుదల శాఖ మంత్రి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి.
అప్పటికీ అధికారులు తీరు మారకపోవడం, ఎత్తిపోతల పథకాల డిజైన్, పనులకు సంబంధించిన పత్రాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించడం, మరోవైపు పనుల ప్రగతిపై ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇస్తుండడం తదితరకారణాల వల్ల ఏజెన్సీవారు రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి క్షేత్ర స్థాయిలో విషయాలు తెలుసుకున్న ఆయన గురురాఘవేంద్ర ప్రాజెక్టు పనుల బాధ్యతను హంద్రీనీవా నుంచి తప్పించాలని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాశారు. ఈ మేరకు ప్రభుత్వం ఆ పనుల పర్యవేక్షణ బాధ్యతలను మైనర్ ఇరిగేషన్ ఎస్ఈకి అప్పగించాలంటూ గత నెల(అక్టోబర్) 22వతేదీన ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ బాధ్యత తీసుకోవాలంటూ సీఈ అదే నెల 26వతేదీన ఎస్ఈకి ఆదేశాలు జారీ చేశారు. అయితే పని భారం అధికంగా ఉందంటూ సీఈ ఉత్తర్వులను ఎస్ఈ వెనక్కు పంపారు. కాంట్రాక్టర్ అధికారులు అడిగినంత మేరకు కమీషన్ ఇవ్వకపోవడంతోనే పనులు పర్యవేక్షణ చేయకుండా, చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించకుండా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. పనుల్లో జాప్యానికి ఇదే కారణంగా తెలుస్తోంది.
పులకుర్తిదీ ఇదే దారి..
కోడుమూరు సబ్ డివిజన్ పరిధిలోని దిగువ కాల్వ ఆయకట్టుకు సాగునీరందించేందుకు చేపట్టిన పులకుర్తి ఎతిపోతల పథకం బాధ్యతను కూడా హంద్రీనీవాకు తప్పించారు. గతేడాది అక్టోబరులో ఇందుకు సంబంధించి కోడుమూరులో ఫైలాన్ ఏర్పాటు చేశారు. పర్యవేక్షణ లోపంతో పనులు ముందుకు సాగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పనుల బాధ్యతలను తీసుకునేందుకు కూడా ఎస్ఈ ససేమిరా అంటున్నారు.
మైనర్కా.. మేజర్కా?
Published Mon, Nov 18 2013 4:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement