జ్యోతుల నెహ్రూకు స్వల్ప అస్వస్థత | minor illness to jyothula nehru | Sakshi
Sakshi News home page

జ్యోతుల నెహ్రూకు స్వల్ప అస్వస్థత

Sep 30 2014 12:03 AM | Updated on May 25 2018 9:17 PM

జ్యోతుల నెహ్రూకు స్వల్ప అస్వస్థత - Sakshi

జ్యోతుల నెహ్రూకు స్వల్ప అస్వస్థత

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష ఉపనాయకుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ సోమవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

కాకినాడ ఆస్పత్రిలో చేరిక.. పలువురి పరామర్శ

కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష ఉపనాయకుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ సోమవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న ఆయనను కాకినాడలోని సేఫ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. జ్యోతుల నెహ్రూను ప్రత్తిపాడు, రంపచోడవరం ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, వంతల రాజేశ్వరి, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, జడ్పీ మాజీ ఛైర్మన్ చెల్లుబోయిన వేణు, పార్టీ జిల్లా యువజన, వాణిజ్యవిభాగాల కన్వీనర్లు అనంత ఉదయభాస్కర్, కర్రి పాపారాయుడు, రాష్ట్ర యువజన విభాగం సభ్యులు వాసిరెడ్డి జమీలు, నాయకులు అత్తిలి సీతారామస్వామి, గొల్లపల్లి బుజ్జి, అత్తులూరి సాయిబాబు, అత్తులూరి నాగబాబు, మాకినీడి గాంధీ, భూపాలపట్నం ప్రసా ద్, మారిశెట్టి భద్రం, వీరంరెడ్డి కాశిబాబుఆస్పత్రికి వచ్చి కలిసి పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement