
చిత్తూరు / వరదయ్యపాళెం: వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మం డలంలోని వెంగారెడ్డికండ్రిగ దళితవాడలో చోటు చేసుకుంది. వివరాలు..గ్రామానికి చెందిన చలపతి, కర్లినాకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఇటీవల ఇద్దరి మధ్య స్వల్ప పాటి వివాదాలు తలెత్తాయి. దీంతో మనస్తాపం చెందిన కర్లినా ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె సోమవారం ఉదయం మృతి చెందింది. ఎస్ఐ హరిప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.