తేనెటీగలను తప్పించుకోబోయి.. చెరువులో దూకాడు | man accidental death | Sakshi
Sakshi News home page

తేనెటీగలను తప్పించుకోబోయి.. చెరువులో దూకాడు

Apr 30 2015 4:22 PM | Updated on Sep 17 2018 8:02 PM

తేనెటీగల దాడి నుంచి తప్పించుకోవడానికి చెరువులోకి దూకాడు ఓ యువకుడు.

విశాఖపట్నం : తేనెటీగల దాడి నుంచి తప్పించుకోవడానికి చెరువులోకి దూకాడు ఓ యువకుడు. అయితే అతనికి ఈత రాకపోవడంతో నీళ్లలో ఊపిరాడక మృతి చెందాడు. ఈ సంఘటన విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలంలో గురువారం చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం... పెదగమనూరు గ్రామానికి చెందిన కె.ప్రసాద్(35)  గురువారం పొలం పనులుకు వెళ్లి వస్తుండగా తేనెటీగలు దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు అతను చెరువులో దూకాడు. ఈత రాకపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement