పశ్చిమ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం మరింత బలహీనపడే అవకాశం ఉందన్ని వాతావరణ శాఖ వెల్లడించింది.
విశాఖః పశ్చిమ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం మరింత బలహీనపడే అవకాశం ఉందన్ని వాతావరణ శాఖ వెల్లడించింది.రేపు కోస్తా ఆంధ్ర అంతటా చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 45-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచవచ్చునని వాతావరణ శాఖ తెలిపింది.
మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. విశాఖలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు ఎగురవేసినట్లు వాతావరణ శాఖ తెలపింది.