టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన కుమారుడు లోకేష్కు తొలిసారి అధికారికంగా పార్టీ బాధ్యతలు అప్పగించారు. కార్యకర్తల కోసం పార్టీ ఏర్పాటు చేసిన సంక్షేమ నిధికి సమన్వయకర్తగా ఆయనను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన కుమారుడు లోకేష్కు తొలిసారి అధికారికంగా పార్టీ బాధ్యతలు అప్పగించారు. కార్యకర్తల కోసం పార్టీ ఏర్పాటు చేసిన సంక్షేమ నిధికి సమన్వయకర్తగా ఆయనను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చాలాకాలంగా లోకేష్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నప్పటికీ పార్టీ ఇప్పటివరకు ఆయనకు ఎలాంటి అధికార బాధ్యతలు అప్పజెప్పలేదు.