గూడూరు: గూడూరు మున్సిపాలిటీలో అవినీతి రాజ్యమేలుతుంది. డబ్బులిస్తే చాలు బతికున్న వాళ్లు సైతం మృతిచెందినట్లు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేస్తారు. అందుకు గోల్కొండ జనార్దన్సింగే ఉదంతమే నిదర్శనం. ఇతను బతికి ఉండగానే మున్సిపల్ అధికారులు మృతిచెందినట్లు ధ్రువీకరణ పత్రాన్ని మీ-సేవా ద్వారా ఇచ్చేశారు. వివరాల్లోకి వెళ్తే... పట్టణంలోని నలజాలమ్మవీధికి చెందిన జనార్దన్సింగ్ మూడేళ్ల నుంచి రూరల్ పరిధిలోని చెన్నూరులో నివాసముంటున్నాడు. రెండో పట్టణంలోని ఇందిరానగర్లో గత ఏడాది అక్టోబర్ 30న అతను మృతిచెందాడని ఓ వ్యక్తి గత నవంబరు 10న మున్సిపల్ కార్యాలయంలో ధ్రువీకరణపత్రం కోసం దరఖాస్తు చేశాడు. సాధారణంగా ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేసేందుకు మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేయాలి. అయితే మున్సిపల్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు పెద్దమొత్తంలో ముడుపులు తీసుకొని ధృవీకరణపత్రాన్ని ఈ సంవత్సరం జనవరి 13న జారీ చేశారు.
వాటాల్లో తేడావచ్చి..
మున్సిపల్ అధికారులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు మధ్య ముడుపుల పంపకం విషయంలో విభేదాలు తలెత్తడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో ఈ విషయాన్ని జనార్దన్సింగ్కు చేరవేశారు. ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మున్సిపల్ ఉద్యోగుల ద్వారానే ఆ మరణ ధృవీకరణపత్ర నకలను తీసుకున్నారు. తాను బతికుండగానే మరణ ధృవీకరణ పత్రాన్ని తనకు ఎలా మంజూరు చేస్తారని మున్సిపల్ అధికారులను నిలదీసినట్లు తెలిసింది. ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు జనార్దన్సింగ్ తెలిపారు.
గూడూరు మున్సిపల్ కార్యాలయంలో సిబ్బంది సంపాదనే ధ్యేయంగా ఉన్నారు. ధృవీకరణ పత్రాల మంజూరులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాలు కమిషనర్కు తెలిసినప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. డబ్బులిస్తే కార్యాలయంలో ఏ పనైనా నిమిషాల్లో జరిగిపోతోంది. డబ్బు లేకుండా పనిచేయించుకోవాలంటే రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. కార్యాలయం సిబ్బంది ముడుపులు చెల్లిస్తే కార్యాలయంలోని రికార్డులను తారుమారు చేయగలరన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నే బతికే ఉన్నా..
Published Sun, Jul 5 2015 2:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement