'అసాంఘిక శక్తులు అధికమయ్యాయి' | k haribabu takes on ap police officialsl | Sakshi
Sakshi News home page

'అసాంఘిక శక్తులు అధికమయ్యాయి'

Jan 20 2015 2:48 PM | Updated on Mar 29 2019 5:35 PM

'అసాంఘిక శక్తులు అధికమయ్యాయి' - Sakshi

'అసాంఘిక శక్తులు అధికమయ్యాయి'

శాంతి భద్రతల కోసం అప్లికేషన్స్ ను ఉపయోగించే అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం లోక్సభ సభ్యుడు కె.హరిబాబు పోలీసు ఉన్నతాధికారుకు సూచించారు.

విశాఖపట్నం: శాంతి భద్రతల కోసం అప్లికేషన్స్ ను ఉపయోగించే అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం లోక్సభ సభ్యుడు కె.హరిబాబు పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. మహిళల భద్రత కోసం ఐక్లిక్ విధానాన్ని మంగళవారం విశాఖపట్నంలో  ఏపీ హోం మంత్రి చినరాజప్ప ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  పాల్గొన్న హరిబాబు మాట్లాడుతూ...ప్రజల్లో మానసిక స్థైర్యాన్ని కలిగించాలని ఆయన పోలీసులుకు హితవు పలికారు. పోలీసుల బలహీనతలు, పనితీరుపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయని... ఈ నేపథ్యంలో ఓ సారి పునసమీక్షించుకోవాలని ఆయన పోలీసులకు సూచించారు.

 

విశాఖలో గతంలో కంటే అసాంఘిక శక్తుల కార్యకలాపాలు అధికమైయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో శాంతియుత వాతావరణం కల్పించకపోతే ఏ పారిశ్రామిక వేత్త విశాఖకు రారని అన్నారు.  గతంలో నగరంలో పోలీస్ శాఖలో చోటు చేసుకున్న తప్పులను సమీక్షించాలని కొత్త సీపీ అమిత్ గార్గ్ కి కె.హరిబాబు హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement