తాటిచెట్లపాలెంలో పర్యటించిన వైఎస్ జగన్

తాటిచెట్లపాలెంలో పర్యటించిన వైఎస్ జగన్ - Sakshi


విశాఖ : విశాఖలో హుదూద్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడోరోజూ పర్యటిస్తున్నారు. ఆయన గురువారం ఉదయం తాటిచెట్లపాలెంలో పర్యటించిన బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తుపాను కారణంగా దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు.


ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు.అలాగే ధర్మనగర్లో తుఫాను బాధితులను ఆయన పరామర్శించారు. మరోవైపు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేయాలని వైఎస్ఆర్‌ సీపీ శ్రేణులకు వైఎస్ జగన్  పిలుపునిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top