'మావోయిస్టు ప్రాంతాలలో హెలికాప్టర్లు వినియోగిస్తాం' | Helicopters in maoists affected areas due to elections | Sakshi
Sakshi News home page

'మావోయిస్టు ప్రాంతాలలో హెలికాప్టర్లు వినియోగిస్తాం'

Mar 15 2014 3:09 PM | Updated on Oct 9 2018 2:39 PM

'మావోయిస్టు ప్రాంతాలలో హెలికాప్టర్లు వినియోగిస్తాం' - Sakshi

'మావోయిస్టు ప్రాంతాలలో హెలికాప్టర్లు వినియోగిస్తాం'

ఎన్నికల సమయంలో మావో ప్రభావిత ప్రాంతలలో హెలికాప్టర్లు వినియోగిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ తెలిపారు.

ఎన్నికల సమయంలో మావో ప్రభావిత ప్రాంతలలో హెలికాప్టర్లు వినియోగిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ తెలిపారు. వెల్లడించారు. శనివారం ఆయన విశాఖపట్నం విచ్చేశారు. ఈ సందర్బంగా విలేకర్ల సమావేశంలో భన్వర్లాల్ మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు 457 భద్రత బలగాలు అవసరమని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.

 

కొత్తగా ఓటర్లు నమోదుకు సీమాంధ్రలో ఏప్రిల్ 8 వరకు గడువు విధించినట్లు చెప్పారు. గుర్తింపు కార్డు సమస్య వస్తే 9246280027కు సంక్షిప్త సందేశం (ఎస్ఎంఎస్) చేయాలని ఆయన ఓటర్లకు సూచించారు.10 లక్షల మంది ఓటర్లు కొత్తగా దరఖాస్తు చేసుకోవడం దేశంలోనే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరిగిందని భన్వర్లాల్ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement