భారీగా భూముల పందేరం! | Heavily land Disributing! | Sakshi
Sakshi News home page

భారీగా భూముల పందేరం!

Jun 25 2016 1:56 AM | Updated on Jul 28 2018 3:33 PM

భారీగా భూముల పందేరం! - Sakshi

భారీగా భూముల పందేరం!

రాజధానితోపాటు పలు జిల్లాల్లో వివిధ సంస్థలకు భారీగా భూకేటాయింపులు చేస్తూ శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

మంత్రివర్గ సమావేశంలో పలు సంస్థలకు భూకేటాయింపులు
 
 సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధానితోపాటు పలు జిల్లాల్లో వివిధ సంస్థలకు భారీగా భూకేటాయింపులు చేస్తూ శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో ప్రైవేటులో కొత్తగా నాలుగు వ్యవసాయ, నాలుగు ఉద్యానవన, ఒక డెయిరీ బిజినెస్, రెండు మత్స్య యూనివర్సిటీల ఏర్పాటు కోసం త్వరలో ఆర్డినెన్స్ జారీ చేయనున్నట్లు తెలిపారు. అర్బన్ ప్రాంతాల్లో టౌన్‌షిప్‌ల నిర్మాణం కోసం అర్బన్ టౌన్‌షిప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. వివిధ శాఖలకు డిప్యుటేషన్‌పై వెళ్లిన వైద్యులు తిరిగి మాతృ శాఖకు రావాలని ఆదేశాలిచ్చారు.

వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్-1కు 60 శాతం అడ్వాన్సు కింద రూ.20.25 కోట్లు, విదేశీ మారక ద్రవ్యంలో వచ్చిన తేడాల కింద రూ.28 కోట్లు, టన్నెల్-2కి 60 శాతం అడ్వాన్సు కింద రూ.6.69 కోట్లు, విదేశీ మారక ద్రవ్యంలో వచ్చిన తేడా కింద రూ.11.60 కోట్లు కేటాయింపు చేశారు. నాలా పన్ను వసూళ్లకు సంబంధించిన నిర్ణయంపై సమగ్ర నివేదికను వచ్చే మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టి చర్చించనున్నారు. కాకినాడ పోర్టును కమర్షియల్ పోర్టుగా మార్చేందుకు స్విస్ చాలెంజ్ విధానాన్ని అనుసరించాలని నిర్ణయించారు. వంశధార ప్రాజెక్టు భూసేకరణకు రూ.433.44 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement