
భక్తుడు అందజేసిన స్వర్ణ శఠారి
తిరుచానూరు పద్మావతి అమ్మవారికి పాదుకలతో కూడిన శఠారిని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ భక్తుడు కానుకగా మంగళవారం అందజేశారు.
తిరుచానూరు: తిరుచానూరు పద్మావతి అమ్మవారికి పాదుకలతో కూడిన శఠారిని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ భక్తుడు కానుకగా మంగళవారం అందజేశారు. అమ్మవారి దర్శనానంతరం ఆశీర్వదించే శఠారిని 300 గ్రాముల బంగారంతో తయారు చేశారు.
ఈ శఠారిని దాదాపు రూ. 8 లక్షలు వెచ్చించి తయారుచేయించినట్లు అధికారులు తెలిపారు.