యైటింక్లయిన్కాలనీ : గోదావరిఖని టూటౌన్పోలీస్స్టేషన్ పరిధి సెంటినరీకాలనీలో సంచలనం సృష్టించిన బంగారం చోరీ కేసు ఓకొలిక్కి వచ్చినట్లుగా సమాచారం. ఈనెల 22న వేకువజామున సెంటినరీకాలనీలోని ఉప్పుల కనకాచారికి చెందిన శ్రీరామ నగల దుకాణంలో చోరీ జరిగింది. షాప్ వెనక తలుపు పగులగొట్టి ఆభరణాలు, అప్పుకాగితాలున్న లాకర్ను దొంగలు ఎత్తుకెళ్లారు. అయితే ఈలాకర్లో కిలో బంగారం, ఆరుకిలోల వెండి, రూ. 7లక్షలు ఉన్నట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గోదావరిఖని డీఎస్పీ మల్లారెడ్డి, టూటౌన్ సీఐ క్రిష్ణ, కమాన్పూర్ ఎస్ఐ ప్రదీప్కుమార్ వెంటనే రంగంలోకి దిగి పూర్తి వివరాలు సేకరించారు. పరిచయం ఉన్న వ్యక్తులే చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానించారు. ఈమేరకు జిల్లా కేంద్రం నుంచి డాగ్స్క్వాడ్ రప్పించి తనిఖీ చేపట్టారు. కొన్ని కీలక ఆధారాలను సేకరించి విచారణ వేగవంతం చేశారు. ఈక్రమంలో అనుమానిత వ్యక్తులపై నిఘా పెంచారు. మండలంలోని ఆదివారం పేటకు చెందిన నలుగురితో పాటు సుల్తానాబాద్ ప్రాంతానికి చెందిన మరోఇద్దరు చోరీకి పాల్పడినట్లుగా అనుమానించారు. గ్రామ శివారులోని పొల్లాల్లో లాకర్ను తీసుకెళ్లి పాతిపెట్టినట్లుగా తెలుస్తోంది. ఈమేరకు నిందితులను అదుపులోకి తీసుకుని లాకర్ను స్వాధీనం చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
24గంటల్లోపే చోరీకేసు ఛేదన..
చోరీ జరిగిన 24గంటల్లోపే నిందితుల వివరాలు, లాకర్ గురించి పోలీసులు వివరాలు సేకరించారు. సీఐ క్రిష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ టీంలను ఏర్పాటు చేసి చోరీని సీరియస్గా తీసుకున్నారు. కొద్దిరోజులుగా షాపు వద్ద అనుమానంగా తిరుగుతున్న వ్యక్తులను గుర్తించి విచారణ జరిపారు.
దీంతో కీలక సమాచారం లభ్యమైనట్లు తెలుస్తోంది. అంతే కాకుండా బంగారాన్ని కుదువ పెట్టి అప్పులు తీసుకున్న వ్యక్తులపై దృష్టి సారించారు. ముఖ్యంగా ఆదివారంపేటకు చెందిన నలుగురు, సుల్తానాబాద్ ప్రాంతానికి చెందిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లుగా తెలిసింది. అయితే బాధితుడు ఫిర్యాదు చేసిన దానికన్నా ఎక్కువ మొత్తంలో బంగారు, వెండి ఆభరాణాలతో పాటు అప్పు పత్రాలు కూడా లాకర్లో ఉన్నట్లుగా సమాచారం. మరికొద్దిరోజులైతే కేసు పీఠముడి విడిపోనుంది.
కొలిక్కి వచ్చిన బంగారం చోరీకేసు
Published Sat, Apr 25 2015 2:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జగనన్న వెంట ఆ ఇంటి ఆడపడుచు లేకున్నా..మేము ఉన్నాం..
ఓటరు జాబితాలో పేరు తొలగించినా ఓటేయవచ్చు !
ఒకసారి తిరిగి చూసుకోండి..
పార్టీలు మారుతున్న అభ్యర్థులు.. ఎంపీలను మార్చేస్తున్న ఓటర్లు!
అలాంటి పాటలంటే నాకు ఇష్టం లేదు.. కానీ: సుకుమార్
వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
రాయల్స్పై గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో ఢిల్లీ!
SRH Vs LSG: ప్లే ఆఫ్స్ రేసు.. రెండింటికీ కీలక మ్యాచ్
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై దుమారం.. మండిపడ్డ బీజేపీ
ఇదే మరి మ్యాజిక్ అంటే.. 'జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్'
తప్పక చదవండి
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటేయవచ్చు!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్గా కరీనా : భావోద్వేగం
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- హైదరాబాద్లో విషాదం.. ఏడుగురు మృతి
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement