మహానందిలో రేపటి నుంచి ఉచిత దర్శనం | Free entry from tomorrow in Mahanadi | Sakshi
Sakshi News home page

మహానందిలో రేపటి నుంచి ఉచిత దర్శనం

Dec 1 2015 1:17 PM | Updated on Sep 3 2017 1:19 PM

మహానంది పుణ్యక్షేతంలో స్వామివారిని దర్శించుకోవడానికి ఎటువంటి డబ్బులు ఇక చెల్లించనక్కర్లేదు.

మహానంది పుణ్యక్షేతంలో స్వామివారిని దర్శించుకోవడానికి ఎటువంటి డబ్బులు ఇక చెల్లించనక్కర్లేదు. భక్తులు ఉచితంగా దర్శించుకునేలా పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మహానంది పుణ్యక్షేత్ర చైర్మన్ మాన్యం ప్రసాదరావు, ఈవో శంకర వరప్రసాద్, పాలకమండలి సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకు ముందు ఆలయ అధికారులు సాధారణ దర్శనం కోసం రూ.10 వసూలు చేసేవారు. దాన్ని ఇప్పుడు ఉచితంగా మార్చారు. ప్రత్యేక దర్శనం రేట్లు ఎప్పటిలానే ఉన్నాయి. కొత్తగా క్షీరాభిషేకంను ప్రారంభించారు. దీని ధర రూ.200లుగా నిర్ణయించారు.



 

Advertisement
 
Advertisement
Advertisement