నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెదపాడు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
నెల్లూరు: నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెదపాడు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెండో ఆటోలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.
మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారని తెలుస్తోంది. వీరంతా నెల్లూరు జిల్లాలో జరుగుతున్న రొట్టెల పండుగలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.