హామీలు నెరవేర్చండి
హామీలు నెరవేర్చండి ప్రధానికి సోనియాగాంధీ లేఖ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, రాజ్యసభలో ప్రధాని ప్రసంగం, హోంమంత్రి హా మీలను అమలుచేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రధానికి లేఖ రాశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హామీలు ఇచ్చిన సంగతి మీకు తెలిసిందే.
అప్పటి ప్రధాని, హోం మంత్రి ఫిబ్రవరి 20న రాజ్యసభలో మరికొన్ని హామీలు ఇచ్చారు. జలవనరులు, ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం వంటి అంశాలు ఇందులో ప్రధానమైనవి. మీ ప్రభుత్వం వీటిని ముందుకు తీసుకెళుతుందని ఆకాంక్షిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.