రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలంటూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో ప్రభుత్వరంగ బ్యాంకులను రైతులు ముట్టడించారు.
రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలంటూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో ప్రభుత్వరంగ బ్యాంకులను రైతులు ముట్టడించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి ఆధ్వర్యంలో ఈ ముట్టడి కార్యక్రమం జరిగింది. రుణమాఫీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేవని, అందుకే తాము రైతులకు నోటీసులు ఇస్తున్నామని బ్యాంకు అధికారులు వారికి స్పష్టం చేశారు.
రుణమాఫీపై చంద్రబాబు ప్రజలను, రైతులను మభ్యపెడుతున్నారని కాకాణి గోవర్ధనరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు సర్కారు కేవలం మాటలతోనే కాలయాపన చేస్తోంది తప్ప రుణమాఫీ విషయాన్ని చేతల్లో చూపించడంలేదని ఆయన అన్నారు.