విద్యుదాఘాతానికి రైతు బలి | Farmer dies of electrocution | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి రైతు బలి

Dec 21 2015 6:54 PM | Updated on Oct 1 2018 2:44 PM

వ్యవసాయ బావి వద్ద విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. ఫ్యూజ్ వేయడానికి ప్రయత్నించిన రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు.

పెద్దతిప్ప సముద్రం (చిత్తూరు) : వ్యవసాయ బావి వద్ద విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. ఫ్యూజ్ వేయడానికి ప్రయత్నించిన రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం బూచిపల్లి వద్ద సోమవారం చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన నర్సింహా రెడ్డి(45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం పొలం వద్ద కరెంట్ సరఫరా నిలిచి పోవడంతో..ఫ్యూజ్ వేయడానికి ప్రయత్నిస్తూ షాక్కు గురై అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement