పాములపాడు (కర్నూలు) : పెట్టుబడికి తెచ్చిన అప్పు తీర్చే దారి కానరాక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా పాములపాడు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న తులసీ నాయక్ గ్రామానికి చెందిన రైతు నుంచి 25 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని మిరప సాగు చేస్తున్నాడు.
ఈ క్రమంలో గింజలు సరిగ్గా మొలకెత్తకపోవడంతో.. రెండోసారి విత్తనాలు నాటాడు. అయినా ఆశించిన స్థాయిలో పంట లేకపోవడంతో.. పెట్టుబడుల కోసం తెచ్చిన రూ. 5 లక్షల అప్పుతో పాటు భూమి గుత్తకు తీసుకున్న రూ. 4 లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Breadcrumb
Related News by category
-
రచ్చ శ్రీను కేరాఫ్ తాడేపల్లిగూడెం
‘నేను నిజాయతీపరుడిని.. నాకు పక్కవాడిది రూపాయి కూడా అక్కర్లేదు.. కష్టపడి సంపాదించి ఈ స్థాయికి చేరాను..’ ఇవీ తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో రోజూ చెబుతున్న మాటలు. అయితే ఆయన అసలు స్వరూపం మరోలా ఉంది. బొలిశెట్టి శ్రీనుకు నియోజకవర్గంలో మరో పేరు ఉంది.. అదే రచ్చ శీను. దుందుడుకు స్వభావంతో ఇతరులను దబాయించడం, తీవ్రస్థాయిలో భయాందోళనలకు గురిచేయడంలో సిద్ధహస్తుడిగా పేరొందారు. లారీ ఫీల్డ్తో మొదలుపెట్టి 30 ఏళ్లలో తాడేపల్లిగూడెంలో సంపన్నుడిగా మారారు. సెటిల్మెంట్లతో ప్రారంభమైన ప్రస్థానం రాజకీయ పార్టీ అభ్యర్థి వరకు సాగిందిలా..సాక్షి ప్రతినిధి, ఏలూరు: బొలిశెట్టి శ్రీనివాస్ను తాడేపల్లిగూడెంలో రచ్చ శీనుగా పిలుచుకుంటారు. 30 ఏళ్లలో కోట్ల సంపద సృష్టించారనేది ప్రచారం. వాస్తవంలో మాత్రం భూ సెటిల్మెంట్లతో మొదలుకొని అభివృద్ధి పనుల్లో పర్సంటేజీల వరకు దండుకుని ఎదిగారనేది అందరికీ తెలిసిన సత్యం. వీటన్నింటితో పాటు జూద కళల్లో ప్రావీణ్యం కూడా ఉందనేది గూడెం ఎరిగిన నిజం. 1981లో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రస్థానం మొదలుపెట్టి, 1999లో మున్సిపల్ కౌన్సిలర్గా, ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. ఆ తరువాత 2014లో టీడీపీలో చేరి మున్సిపల్ చైర్మన్గా ఐదేళ్ల పాటు పనిచేసి 2019లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఈసారి ఎన్నికల్లో మళ్లీ అదే పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బియ్యం అక్రమ రవాణా : సామాన్య కుటుంబం నుంచి వచ్చిన బొలిశెట్టి క్లాస్ వన్ కాంట్రాక్టర్ అని చెప్పుకుంటారు. కౌన్సిలర్గా ప్రారంభమైన నాటి నుంచే భూ సెటిల్మెంట్లలో అందె వేసిన చేయి. లెక్కకు మించి భూ సెటిల్మెంట్లు, చౌకగా భూములు కొనడం, భారీగా అమ్మడంతో ఆర్థికంగా ఎదిగారు. అక్కడి నుంచి సివిల్ సప్లయీస్కు లారీల కాంట్రా క్టర్గా, గన్నీ బ్యాగ్ సప్లయర్గా, కందిపప్పు సప్లయర్గా మారి భారీగా అవకతవకలకు పాల్పడ్డారు. బియ్యం అక్రమ రవాణా, కందిపప్పు కల్తీలో సిద్ధహస్తుడిగా పేరొందారు. కట్ చేస్తే.. ఒకే లారీకి నంబర్ ప్లేట్లు మార్చి రవాణా చేయడం, అక్రమ బియ్యం సరఫరా వ్యవహారంలో కత్తిపూడి వద్ద లారీలను పట్టుకోగా కేసు నమోదైనట్టు సమాచారం. ఈ పరిణా మాల క్రమంలో ఆయన లైసెన్స్లను బ్లాక్ లిస్టులో పెట్టడంతో బావమరిది పేరుతో మరో లైసెన్స్ సృష్టించి దానిపై ఇదే వ్యాపారాన్ని నిరాటంకంగా కొన సాగించారు. ఈ పరిణామ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి కేసు కూడా నమోదై ముగిసిపోయింది. బినామీ కాంట్రాక్టర్లతో భారీగా దండుకొని.. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ నిధులతో పార్కుల నిర్వహణ, డ్రెయిన్ల పూడికతీత, ఇతర అభివృద్ధి పనులన్నీ బినామీ కాంట్రాక్టర్లతో చేయించి భారీగా దండుకున్నట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. మున్సిపాలిటీలో ఎల్ఈడీ లైట్ల కొనుగోలు టెండర్లో రూ.5 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, అప్పట్లో పట్టణమంతా చర్చ సాగింది. 20 ఎకరాల లేఅవుట్లో పది శాతం కమీషన్, పట్టణంలోని అనధికారిక లేఅవుట్లో 25 శాతం వాటాలు, దళితులకు చెందిన అసైన్డ్ భూమి స్వాహా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చంపేస్తామని మహిళకు బెదిరింపులు స్థలం అమ్మకపోతే చంపేస్తామని మహిళను బెదిరించిన కేసు కూడా 692/2021గా బొలిశెట్టిపై నమోదైంది. కొయ్యలగూడేనికి చెందిన మార్ని ప్రవీణ అనే మహిళకు గూడెంలోని మోర్ సూపర్బజార్ ఎదురుగా స్థలం ఉంది. బొలిశెట్టి దానిని తమకు విక్రయించమని కోరితే ఆమె నిరాకరించడంతో రాత్రికి రాత్రే కుర్రాళ్లను పెట్టి సరిహద్దు గోడను పగులగొట్టించి స్థలం అమ్మకపోతే చంపేస్తామని బెదిరించారు. ఈ సంఘటనలో బొలిశెట్టి శ్రీనివాస్ మూడో నిందితుడిగా, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జీని 4వ నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేశారు. పేకాటలో సిద్ధహస్తుడు బొలిశెట్టికి ప్రవృత్తి రీత్యా ఇష్టమైన క్రీడ పేకాట. 2010లో పేకాడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొద్దిరోజులు పేకాట క్లబ్లు నడిపారనే ఆరోపణలు ఉన్నాయి. పేకాటకు సంబంధించిన కేసు విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో ఆయనే ధ్రువీకరించారు. 2010లో క్రైమ్ నం.169 పట్టణంలోని ఒక రెసిడెన్సీలో పేకాడుతుండగా పోలీసులు దాడి చేసి రూ.26,565 స్వా«దీనం చేసుకుని బొలిశెట్టి శ్రీనును ఏ1గా చేర్చారు. 2020లో ఎస్సై, కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించి.. అరెస్టయిన వ్యక్తిని స్టేషన్ నుంచి తీసుకువెళ్లడమే కాకుండా 20 మంది కుర్రాళ్లను పంపి అందరి సంగతీ తేలుస్తానని పోలీసులను బెదిరించిన ఘటనలో క్రైమ్ నం.42తో కేసు నమోదైంది. తాడేపల్లిగూడెం అభివృద్ధికి మోకాలడ్డు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పారీ్టలో చేరిన క్రమంలో 2014లో తాడేపల్లిగూడెం నుంచి కౌన్సిలర్గా గెలిచి బొలిశెట్టి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఆ సమయంలో ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు (బీజేపీ) మంత్రి అయ్యారు. కట్ చేస్తే.. మాణిక్యాలరావుకు చుక్కలు చూపించి ఆయన్ను మించి సంపాదించడంతో పాటు ఏ ఒక్క అభివృద్ధి పనీ ముందుకు సాగకుండా ఐదేళ్ల పాటు చేయడంలో బొలిశెట్టి సూపర్ సక్సెస్ అయ్యారు. మంత్రి మాణిక్యాలరావు మంజూరు చేయించిన పనులన్నింటినీ కౌన్సిలర్ తీర్మానం పేరుతో అడ్డుకుని పట్టణ అభివృద్ధిని ఐదేళ్లు వెనక్కి నెట్టారు. ప్రధానంగా మోడల్ ప్రాజెక్ట్గా ఏసీ రైతు బజారును మంత్రి మాణిక్యాలరావు గూడెంకు మంజూరు చేయించారు. ఏసీ ఫిష్, నాన్వెజ్ మార్కెట్, కూరగాయల మార్కెట్ అన్ని మున్సిపాలిటీలోని ప్రధాన ప్రాంతంలో ఉన్న ఎకరా స్థలంలో ఏర్పాటు చేయడానికి వీలుగా రూ.9 కోట్ల ప్రాజెక్టు మంజూరైంది. మాణిక్యాలరావుతో ఆధిపత్య పోరు ఉన్న క్రమంలో కౌన్సిల్లో తీర్మానం చేసి స్థలం మంజూరు చేయకుండా రూ.9 కోట్ల ప్రాజెక్టును గూడెంకు రాకుండా చేయడంలో బొలిశెట్టి సఫలీకృతులయ్యారు. అలాగే దాదాపు రూ.10 కోట్ల విలువైన రహదారుల పనులకు తీ ర్మానాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు. తాడేపల్లిగూ డెం, పెంటపాడు మండలాల్లో మంత్రి పనులన్నింటికీ అడ్డంకొట్టి తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో మాత్రం తన స్నేహితుడి దగ్గర పర్సంటేజ్ తీ సుకుని పనులు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. -
సంతోషాలు పంచిపెట్టె
నరసరావుపేట: వారు రైతు బిడ్డలు. భూమాతను నమ్ముకున్న అన్నదాతల కష్టాలు తెలిసిన మానవతావాదులు. జన్మభూమి రుణం తీర్చుకోవాలనుకున్నారు. ఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీలు చేసినా ఉద్యోగం చేయాలనే ఆలోచనలకు స్వస్తి పలికారు. ఉన్న ఊరిలోనే పలువురికి ఉపాధి కలి్పస్తూ సొంతంగా వ్యాపారం చేయాలని సంకలి్పంచారు. ప్యాకింగ్ పరిశ్రమకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ రాయితీలతో వ్యాపారాన్ని విస్తరించారు. ఇదీ నరసరావుపేట ఆంజనేయ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ విజయ ప్రస్థానం.ఆంజనేయ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ విజయప్రస్థానం ∙ స్వయం ఉపాధితో పాటు 40 మందికి బతుకుతెరువుప్రభుత్వ ప్రోత్సాహంతో వ్యాపారం విస్తరిస్తున్నామన్న యాజమాన్యం ∙ ఉన్నత చదువులు చదివినా ఉన్న ఊరికి మేలు చేయాలనే సంకల్పంఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీ చేశారు. అయినా ఉద్యోగాల కోసం ఎదురుచూపులు చూడలేదు. స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రాంత అవసరాలపై దృష్టి కేంద్రీకరించారు. అధ్యయనం చేశారు. ఆయిల్, స్పిన్నింగ్, మిల్క్ యూనిట్లు అనేకం ఉండడంతో ఆయా ఉత్పత్తులు ప్యాకింగ్ చేసేందుకు అవసరమైన అట్ట పెట్టెలు తయారీ పరిశ్రమ నెలకొల్పాలని నిర్ణయించుకున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రైవేటు లిమిటెడ్ (ఏపీఐఐసీ) ద్వారా ప్యాకింగ్ పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇదీ నరసరావుపేట పెద్దచెరువు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉన్న ఆంజనేయ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ అధినేత కామిరెడ్డి కృష్ణకిషోర్రెడ్డి విజయగాథ.వైఎస్సార్సీపీ ప్రభుత్వ రాకతో ఉజ్వల ప్రగతి పరిశ్రమ ఏర్పాటుచేసిన కొన్ని నెలలకే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వ విధానాలతో పారిశ్రామిక ప్రగతి పరుగులు తీసింది. ఓ వైపు కోవిడ్ తో ప్రభుత్వానికి ఆరి్థక కష్టాలు వెంటాడుతున్నా సీఎం జగన్ మోహన్ రెడ్డి చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వంలో 2015–20 పాలసీ కింద ఏర్పాటుచేసిన పరిశ్రమలకు చెల్లించాల్సిన సబ్సిడీలను విడుదల చేశారు. దీంతో ఆంజనేయ ఇండస్ట్రీస్ కు రూ. 13 లక్షల సబ్సిడీ లభించింది. దీంతోపాటు విద్యుత్ టారిఫ్ల మినహాయింపులు, చెల్లించాల్సిన రుణానికి వడ్డీలో సబ్సిడీ మంజూరు చేశారు. ప్రభుత్వ చర్యలతో యజమానుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. సుమారు 40 మంది ఉద్యోగులు, కూలీలను నియమించుకొని వ్యాపారాన్ని మరింత విస్తరించారు. మూడు షిప్టులుగా పనిచేస్తున్న సిబ్బందికి ఒకొక్కరికి నెలకు రూ.40వేలు నుంచి రూ.15వేలు వరకు జీతాలు చెల్లించి ఉపాధి చూపించారు. జిల్లాలోని పలు వ్యాపారులు, పరిశ్రమలకు కావాల్సిన అట్టపెట్టెలను ఆర్డర్లు తెప్పించుకొని వారికి నచ్చిన రీతిలో తయారుచేసి సకాలంలో అందిస్తూ వ్యాపారుల మన్ననలు పొందుతున్నారు. ఇంతితై వటుడింతై అన్న చందంగా పరిశ్రమ దినదినాభివృద్ధి చెందింది. ఐదేళ్ల కాలంలో ఏడాదికి రూ.3 నుంచి 4కోట్ల టర్నోవర్ చేస్తూ ప్రగతిపథంలో దూసుకుపోతోంది. ప్రభుత్వ ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైందని యజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం రిక్త హస్తం పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రచారాలు చేసిన గత టీడీపీ పాలకులు హామీలను తుంగలో తొక్కారు. ఎటువంటి సబ్సిడీని మంజూరు చేయకపోయినా కృష్ణకిషోర్ రెడ్డి ఆటుపోట్లను ఎదుర్కొని సొంత పెట్టుబడితో పరిశ్రమను స్థాపించాడు. సంస్థ కార్యకలాపాలు విస్తరించాలనుకున్నా ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. దీంతో కష్టంగానే వ్యాపారాన్ని నెట్టుకొచ్చారు.40 మందికి ఉపాధి నరసరావుపేటకు చెందిన కామిరెడ్డి కృష్ణకిషోర్రెడ్డి ఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీ చేశారు. నరసరావుపేటలోనే ఏదైనా పరిశ్రమ పెట్టాలని భావించారు. ఈ ప్రాంతంలో ఆయిల్, స్పిన్నింగ్ మిల్లులు, మిల్క్ యూనిట్లు, లాంటి సంస్థల ఆవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్యాకింగ్కు ఉపయోగించే అట్టపెట్టెల పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నారు. ఎంఎస్ఎంఈ ప్రోత్సాహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రైవేటు లిమిటెడ్ (ఏపీఐఐసీ) ద్వారా ప్యాకింగ్ పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాడు. 2015 నుంచి 2020 పరిశ్రమల ఇండ్రస్టియల్ డెవలప్మెంట్ పాలసీ కింద లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తన స్నేహితుడు గెల్లి అరుణ్రెడ్డిని భాగస్వామిగా చేసుకొని 2019 జనవరిలో పట్టణంలోని పెద్దచెరువు ఇండ్రస్టియల్ ఎస్టేట్లో ఆంజనేయ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ అనే చిన్నతరహా పరిశ్రమను ఏర్పాటు చేశారు. మెషినరీ కోసం రూ.60లక్షలు, మరో రూ.25లక్షల ఓవర్ డ్రాప్్టతో సంస్థను ప్రారంభించారు. నా ఆశయం నెరవేరింది మా లాంటి చిన్నతరహ పరిశ్రమలకు ప్రస్తుత ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది. ఏ అధికారి వత్తిళ్లు లేవు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు సకాలంలో చెల్లిస్తున్నాం. ఉన్న పట్టణంలోనే పదిమందికి ఉపాధి కలి్పంచాలనే నా ఆశయానికి ప్రభుత్వ సహకారం తోడైంది. వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాం. –కామిరెడ్డి కృష్ణకిషోర్రెడ్డి, ఎం.డి. ఆంజనేయ ప్యాకింగ్ ఇండస్ట్రీ ఉన్న ఊరిలో ఉపాధి దొరికింది ఈ పరిశ్రమ రావడంతో నాకు ఉన్న ఊరిలోనే ఉపాధి లభించింది. ఐదేళ్లుగా పనిచేస్తున్నాను. నెలకు రూ. 15 వేలు జీతం ఇస్తుండడంతో కుటుంబ అవసరాలకు ఇబ్బంది లేకుండా గడిచిపోతోంది. పనిలో ఎటువంటి ఒత్తిడి లేకుండా అట్ట పెట్టెలు తయారుచేస్తున్నాను. –కె.కోటేశ్వరరావు, కూలీ యూనిట్ పేరు : ఆంజనేయ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ ఉత్పత్తి : అట్ట పెట్టెల తయారీ యజమానులు : కృష్ణకిషోర్రెడ్డి, అజయ్ రెడ్డి పెట్టుబడి : రూ. 85 లక్షలు టర్నోవర్ : రూ. 3 కోట్లుఉపాధి : 40 మంది కేటగిరి : చిన్నతరహా ప్రాంతం : నరసరావుపేట -
అది విజనరీ కాదు..‘విష’నరీ
సాక్షి, విశాఖపట్నం/అనంతగిరి: ‘అరకు నియోజకవర్గంలో పెదలబుడు పంచాయతీని దత్తత తీసుకుంటున్నా. స్మార్ట్ విలేజ్గా మార్చేస్తా. ప్రతి ఇంటికీ నిరంతరం నీటిని అందిస్తాను’ అని సీఎం హోదాలో చంద్రబాబు 2015 జనవరిలో బీరాలు పలికారు. ఏడాదిన్నర గడిచినా ఆ ఊరి వైపు కన్నెత్తి చూడలేదు. చివరికి ప్రజలు రోడ్డెక్కడంతో 2016 మేలో ఆగమేఘాలపై అక్కడకు వచ్చి మంచినీటి కుళాయిల కోసం రూ.5 కోట్లు, సిమెంట్ రోడ్లకు రూ.9 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.ఆ నిధులూ వచి్చంది లేదు.. పనులు జరిగిందీ లేదు. అయితే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక బాబు దత్తత తీసుకున్న ఈ గ్రామంలో సామాజిక, ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. ప్రతి ఇల్లు అభివృద్ధి పథంలో నడుస్తోంది. గిరి గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఆయా గ్రామాలు నేడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. పెదలబుడు మేజర్ పంచాయతీలో ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధులు వెచి్చంచారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ అందుబాటులోకి వచ్చాయి. మూడు సచివాలయాల పరిధిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలు రూ.37 కోట్ల లబ్ధి పొందారు. -
CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
ఇచ్చిన హామీలు అమలు చేయడం ఆయనకే చెల్లు జగన్లోని పట్టుదల ఎందరికో స్ఫూర్తిదాయకం సాక్షి ఇంటర్వ్యూలో సినీనటి, యాంకర్ శ్యామల ‘వైఎస్సార్సీపీ నవరత్నాలు అమలు సాధ్యమేనా అన్న నోళ్లు మూతపడేలా అమలు చేసి చూపించారు సీఎం జగన్. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రతి ఒక్కరికీ ఓ లెసన్. ‘జగన్ గెలుపు అంటే జనం గెలుపు’ అన్నది ఈ ఎన్నికల్లో స్పష్టం కానుంది’ అని సినీనటి, ప్రముఖ బుల్లితెర యాంకర్ శ్యామల అన్నారు. కొంత కాలంగా వైఎస్ జగన్కు మద్దతుదారుగా ఉన్న ఆమె ఈ ఎన్నికలలో వైఎస్సార్సీపీ తరఫున చురుకుగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు. జగన్పై తనకు అభిమానం కలగడానికి కారణాలను... తన భవిష్యత్తు రాజకీయ ప్రయాణాన్ని ఆమె తెలియజేశారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...వైఎస్ అంటే ఇష్టం.. జగన్పై అభిమానం... తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణం సమీపంలోని ఇంద్రపాలెం మాది. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన నాకు రాజకీయ నేపథ్యం ఏమీ లేదు. ఎదుగుతున్న సమయంలో లీడర్స్ చేపట్టే పనులు మన మీద చాలా ప్రభావం చూపుతాయి కదా. అలా తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేసినప్పటి నుంచీ వైఎస్ అంటే నాకు చాలా ఇష్టం. కట్టు బొట్టు నుంచి ఆయన ఆహార్యం దాకా అన్నీ గమనిస్తుండేదాన్ని. ఆయన హుందాతనం, మందహాసం బాగా నచ్చేవి. కెరీర్ కోసం హైదరాబాద్ వచ్చేసిన తర్వాత.. వైఎస్సార్ మరణించిన సమయంలో ఉప్పల్లో ఓ ప్రైవేట్ చానల్లో పనిచేస్తున్నాను. ఎంతగానో బాధనిపించినా... ఆ సమయంలో ఎటూ కదలడానికి వీలు కాలేదు. వైఎస్ మరణం తర్వాత జగన్ను బాగా గమనిస్తూ ఉండేదాన్ని, ఆయన చేసిన పోరాటం, అడ్డంకులు ఎదుర్కొంటూ ఆయన వేసిన అడుగులు చూశాక ఆయనపైనా కొండంత అభిమానం కలిగింది. నా భర్త కూడా జగన్ అభిమాని కావడంతో... ఆయన్ను స్వయంగా కలవడం, ఆయన చేతుల మీదుగా వైఎస్సార్సీపీ కండువా ధరించడం జరిగిపోయాయి. హామీల ఆమల్లో ఆయనకు ఆయనే సాటి ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలి? ప్రజలకు ఆపద వస్తే ఎలా స్పందించాలి? ఇలాంటివన్నీ జగన్ను చూసి నేర్చుకోవాలి. అందుకే భవిష్యత్తు రాజకీయ నేతలకు ఆయన పాలన ఒక పాఠం అంటాను నేను. ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాల గురించి మొదట్లో విని... బాబోయ్ ఇన్ని పథకాలా? ఎలా ఇస్తారో అని భయపడిన మాట నిజం. కాని అవి పక్కాగా అందించడానికి గ్రామ వలంటీర్ పేరిట ఏకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది కలిగిందీ అంటే ఫిర్యాదు చేసిన 10–20 రోజుల్లోనే ఆ సమస్య పరిష్కారం అయిపోయేలా పక్కాగా నిర్వహించడం అద్భుతం అనిపించింది.కోవిడ్ సవాల్నూసమర్థంగా ఎదుర్కొని... ప్రపంచమే బిత్తరపోయిన సంక్షోభం కోవిడ్. మహామహులే ఆ సమయంలో చేతులెత్తేశారు. అలాంటిది ఒక కొత్త సీఎం, అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాలేదు. ఇలాంటి తరుణంలో అనూహ్యమైన ఈ చాలెంజ్ ఎదురైనా.. జగన్ అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా రెండు వేవ్స్నూ సమర్థంగా ఎదుర్కొన్నా రు. అందుకే నేను ఫిదా అయ్యా. ఇప్పటికీ మారుమూల గ్రామాల్లోని ప్రజల్ని కలిసినప్పుడు వారు చెబుతున్నదీ అదే. ‘కోవిడ్ టైమ్లో సొంత వారు కూడా మా మొహం చూడలేదమ్మా.. అలాంటిది వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతీదీ మా చేతికి అందించింది’ అని.జగన్ గురించి తెలుసుకున్న కొద్దీ సంతోషం మా సొంత ఊరితో పాటు మా అత్తగారి ఊరు చీరాలకు రాకపోకలు సాగించినప్పుడు, షూటింగ్ కోసం గ్రామాలకు వెళ్లినప్పుడు... అక్కడి స్థితిగతుల గురించి కనుక్కునేదాన్ని. వీలైనంతమందితో మాట్లాడేదాన్ని. వాళ్లందరి స్పందన తెలుసుకుంటున్న కొద్దీ జగన్ మీద ఇష్టం పెరుగుతూ వచి్చంది. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన నాడు నేడు కార్యక్రమం నా ఆల్ౖ టెమ్ ఫేవరెట్. నేను కాకినాడ ప్రభుత్వ పాఠశాలలో చదువు కున్నా. ఆ స్కూల్లో 7వ తరగతి వరకూ అసలు ఇంగ్లిష్ మీడియం ఉండేది కాదు. ఇప్పుడు ఏకంగా డిజిటల్ బోధన, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్స్, స్కూల్ బ్యాగ్స్, షూస్, సాక్స్... ఇవన్నీ ఇవ్వడం మామూలు విషయం కాదు. ఇటీవల ఒక ప్రభుత్వ పాఠశాల విద్యారి్థని జగన్ ముందు అద్భుతమైన ఇంగ్లిష్ లో మాట్లాడితే షాక్ అయిపోయా. ఆ భాషా పరిజ్ఞానం నాకు కూడా లేదు. కేవలం రాజకీయాల కోసం ఓ పాపను దారుణంగా ట్రోల్ చేయడం దారుణం.అవకాశాలు పోతాయని వారించినా...అయితే నేను ఇంకా సినీ–టీవీ కెరీర్ ప్రారంభంలోనే ఉండడంతో పార్టీ మనిషిగా ముద్ర వేసుకోవడం మంచిది కాదంటూ చాలా మంది హెచ్చరించారు. నిజానికి ఇప్పటికీ చాలా మంది అలాగే చెబుతుంటారు. అయితే ఏదో రాజకీయ పారీ్టలో ఉన్నానని ఒక క్యారెక్టర్కి నేను సరిపోతానని తెలిసినా పిలవకుండా ఉంటారా? అలా జరగదని నా నమ్మకం. ఇప్పటివరకూ అలాంటి అనుభవాలు కూడా ఎదురవ్వలేదు. నేను కేవలం టీవీ యాంకర్గానే కాకుండా మాచర్ల నియోజకవర్గం, బెంగాల్ టైగర్... తదితర సినిమాల్లో మంచి పాత్రల్లో చేశాను. -
అవినీతి ‘కాలువ’
ప్రభుత్వ అక్రమాలను ఎత్తిచూపే పాత్రికేయమే రాజకీయ అవతారమెత్తితే...ఇంకేముంది..ప్రజాధనాన్ని ఎలా దోచుకోవాలో ...ఎంతగా దోచుకోవాలో ఆనుపానులు కనిపెడుతుంది...అనంతపురం జిల్లాలోని కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గంలో ఇలాంటి ప్రతినిధి ఒకరు పచ్చ మీడియా అధినేత ఆశీస్సులతో టీడీపీలోకి ప్రవేశించి, మొదట ఎంపీ అయ్యారు.. అ తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. చీఫ్విప్ ...మంత్రి పదవులూ దక్కించుకున్నారు.. పనిలోపనిగా గుడ్విల్ పేరిట అక్రమార్జన పనిలో పడ్డారు.అతి తక్కువ వ్యవధిలోనే రూ.1500 కోట్లను ఆర్జించారంటే ఈ నేత దోపిడీ పనితనం ఎంత గొప్పదో అర్థమవుతుంది.. ఇసుక... మట్టి, సాగునీటి ప్రాజెక్టులు.. చెరువుల పూడికతీత పనుల్లో దోపిడీకి అవకాశమున్న మేరకు దోచుకున్నారు... ఈ అపర వెంకన్న దోపిడీ ధనం ‘కాలువై’ పొంగి పొర్లుతోంది.. ఆ దోపిడీ ప్రవాహం ఎలా సాగిపోయిందంటే....సాక్షి టాస్క్ఫోర్స్: ఆయన పేరు తిరుమల వేంకటేశ్వరుడికి పర్యాయ నామం. పేరుకు తగ్గట్టుగా వ్యవహరించడం ఆయనలో లేదు. మనిషిని చూస్తే తెల్లగా, ఎర్రగా కనిపించినా అవినీతిలో మాత్రం స్వభావం నలుపే. పాత్రికేయ వృత్తితో అతి సామాన్య జీవనం ఆరంభించినా, రాజకీయం రారమ్మని తలుపు తట్టింది. రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగి టీడీపీ అధినేత చంద్రబాబుకు విధేయుడిగా మార్కులు కొట్టేశారు. టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడిగా పదవి దక్కించుకున్నారు. ఆ పార్టీ తరఫున ఎంపీగా ఓ సారి గెలిచి.. రెండో సారి ఓటమి పాలయ్యారు.తన జిత్తుల మారి ఎత్తులతో 2014లో అసెంబ్లీ టికెట్ సాధించుకున్నారు. స్వల్ప మెజారీ్టతో ఎమ్మెల్యేగా గట్టెక్కారు. ఆ తర్వాత చీఫ్విప్గా ఉంటూ అమాత్యుడిగా అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ అవకాశాన్ని రెండు చేతులతో సద్వినియోగం చేసుకుని ఆరి్థక బకాసురుడిగా ఎదిగారు. ఇసుక నుంచి మట్టిదాకా.. ప్రాజెక్టుల నుంచి రోడ్ల వరకూ దేన్నీ వదలకుండా దోచేశారు. ప్రతి పనిలోనూ అంచనాలు పెంచి గుడ్విల్ పేరుతో దిగమింగారు. ఈ విషయాలను అప్పట్లో సొంత పార్టీ నేతలే బాహాటంగా వ్యతిరేకించారు. తల్లి పంట మేస్తే... పిల్ల మేర మేసినట్టు తామేమీ తక్కువ కాదన్నట్టు ఆ నాయకుడి అండదండలతో తమ్ముళ్లూ అవినీతిలో మునిగి తేలారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో రూ.1,500 కోట్లకు పైగా అవినీతి సొమ్ము పోగుచేసి ఉంటారనే అభియోగాలు ఉన్నాయి. ప్రజల్లో హాట్టాపిక్గా నిలిచిన ఈ వ్యవహారం ఇప్పటికీ మరచిపోలేని పరిస్థితి. ఆ మరకను ఎదుటి వారికి అంటించి కడుక్కోవాలని చూసినా ప్రజలు నమ్మలేకపోతున్నారు. ఆ మాజీ నేత మళ్లీ ప్రజాప్రతినిధిగా గెలవడానికి చేయని పనులు లేవు. అక్రమాల తీరిలా.. : జీడిపల్లి రిజర్వాయర్ నుంచి భైరవానితిప్ప (బీటీ) ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తెస్తామనే నెపంతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు ఈ మాజీ నాయకుడు. ఈ నేపథ్యంలో ఫేజ్–1 కింద రూ.450 కోట్లను కేటాయిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. మొత్తంగా రూ.968 కోట్లకు పరిపాలన అనుమతులను జారీచేశారు. అయినా భూనిర్వాసితులకు పిసరంతైనా నష్టపరిహారం అందించలేదు.ఆ పనులను ప్రస్తుతం మరో దుర్గం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ నేత సంస్థకు కట్టబెట్టి దోపిడీ పర్వానికి తెరలేపారు. ఆయన డీకేటీ భూముల్లో మాత్రమే కాలువ తవ్వకం పనులు చేపట్టి, రైతులను నమ్మించే ప్రయత్నం చేశారు. బోరంపల్లి లిఫ్ట్ నుంచి 56 కిలోమీటర్ల దూరంలోని బీటీప్రాజెక్టుకు నీరివ్వాలి. అప్పటి ధర ప్రకారం కిలో మీటర్కు రూ.3 కోట్లు ఖర్చవుతుందని కాంట్రాక్టర్లు అంచనా వేశారు. మెకానికల్ పనులతో కలిపితే రూ.350 కోట్లలోపే వ్యయంతో నీరివ్వొచ్చు.దోచుకోవాలి కాబట్టి ఏకంగా రూ.968 కోట్లకు అంచనాలు పెంచారు. ఇందులో తలా కొంచెం పంచుకుతినేలా కుట్రలు పన్నారు. ఈ పనుల్లో అడుగడుగునా అక్రమాలకు పాల్పడ్డారు. ప్రాజెక్టు వద్ద వేసిన పైలాన్ మొదలు ల్యాండ్స్కేప్, రంగులు తదితర పనుల్లో రూ.కోట్లు మెక్కేసిన వైనంపై ఈ ప్రాంతంలో ఎవరినడిగినా చెబుతారు. ⇒ నియోజకవర్గ ముఖ్యపట్టణం నుంచి కళ్యాణదుర్గం రోడ్డు విస్తరణ పనుల్లోనూ రూ.20 కోట్ల వరకు ఈ నేత గుడ్విల్ మెక్కారనే ఆరోపణలూ బలంగా ఉన్నాయి. ఈ పనులకు అప్పటి ప్రభుత్వం రూ.222 కోట్లతో టెండర్ పిలిచింది. కిలోమీటర్కు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల చొప్పున 56 కిలోమీటర్లకు రూ.112 కోట్ల నుంచి రూ.168 కోట్లు ఖర్చవుతుంది. అలా చేస్తే తమకు మిగిలేదేమీ ఉండదు కాబట్టి రూ.54 కోట్ల నుంచి రూ.110 కోట్ల మేర అంచనాలు పెంచి రూ.222 కోట్లకు తుది అంచనాలు రూపొందించారు.ఈ పనులను కేసీపీఎల్– లికాన్ ఏజెన్సీ 15.35 శాతం తక్కువతో రూ.194 కోట్లకు దక్కించుకుంది. దీనివల్ల ఏజెన్సీకీ లాభమే. ఈ పనుల్లో 10 శాతం అంటే రూ.20 కోట్ల వరకు అప్పట్లో మంత్రిగా ఉన్న ఈ నేతకు ముడుపులు అందినట్టు ఆరోపణలున్నాయి. ⇒ ఈ మాజీ ఎమ్మెల్యే హయాంలోనే కణేకల్లు, బొమ్మనహాళ్, డి హీరేహాళ్ మండలాల్లో ఇసుక–మట్టి అక్రమ రవాణా జిల్లాలోనే ఓ మాఫియాను తలపించింది. రచ్చుమర్రి వద్ద వేదావతి హగరి నదిలో తవ్విన ఇసుకను ఈనేత అండదండలతో ఓ సంస్థ సహకారంతో నేరుగా బెంగళూరుకు తరలించి రూ.కోట్లను కూడబెట్టుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో పత్రికలు, టీవీ చానళ్లలోనూ ఈ అవినీతి బాగోతంపై అనేకమైన కథనాలు వచ్చాయి. చివరకు తమ మానస పుత్రికగా చెప్పే ఈనాడులోనే ‘మంత్రి ఇలాకాలో కంత్రీల కులాసా’ శీర్షికతో కథనాన్ని ప్రచురించారంటే అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక్క వ్యవహారంలోనే రూ.350 కోట్లకు తక్కువ కాకుండా కూడగట్టారనే అభియోగం నేటికీ ఉంది. అప్పట్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను కణేకల్లు పోలీసులు పట్టుకుంటే పోలీస్స్టేషన్ ముందు నేరుగా ఈ మాజీ మంత్రి ధర్నా చేపట్టడం తీవ్ర విమర్శలకు తావిచి్చంది.రాయదుర్గం మండలం టీ వీరాపురం, డి హీరేహాళ్ ప్రాంతాల్లో రూ.కోట్ల విలువ చేసే మట్టిని కర్ణాటక ప్రాంతానికి తరలించారు. ఆనాటి అక్రమాల ఆనవాళ్లు నేటికీ తన అవినీతిని బట్టబయలు చేస్తున్నాయి. ⇒ముఖ్య పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో విలువైన రిజర్వ్ స్థలాన్ని టీడీపీ కౌన్సిలర్ ఒకరు ప్లాట్లు వేసి అమ్మేశారు. ఈయన్ని అనుసరిస్తూ మరింత మంది దురాక్రమణకు పాల్పడి విలాసవంతమైన భవనాలను నిరి్మంచారు. వాటిని రూ.లక్షలకు అమ్ముకుని సొమ్ము కూడగట్టారు.మల్లాపురం, గౌడ, భంభంస్వామి, ముత్రాసకాలనీ, బీటీపీ, గ్యాస్గోడౌన్ లేఅవుట్లలో భవిష్యత్తు అవసరాల కోసం వదిలిన రిజర్వ్ స్థలాలను సైతం మాజీ ఎమ్మెల్యే అండతో తమ్ముళ్లు ఆక్రమించారు. ఒక్కో స్థలాన్ని రూ.30 వేల నుంచి రూ.50 వేలకు అమ్మేశారు. ఇటీవలే టీడీపీ నాయకుడి సహకారంతో పేదలకు చెందిన నాలుగు ప్లాట్లను రూ.6 లక్షలకు ఓ వ్యక్తి అమ్ముకున్నాడు. ఆ విషయమూ వివాదంగా మారింది. ⇒ ఈ టీడీపీ మాజీ ఎమ్మెల్యే హయాంలో కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల్లో ఇసుక మేటల నివారణలో భాగంగా రూ.కోట్ల మొత్తాన్ని ఖర్చు చేసినట్టు రికార్డుల్లో చూపారు. పొలాల్లో మాత్రం ఇసుక అలాగే ఉండిపోయింది. ఆ రికార్డులు సైతం మాయం చేయడం గమనార్హం. నీరు–చెట్టు పనుల్లో సైతం రూ.50 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు తమ్ముళ్ల జేబులోకి చేరాయి. ఇందులో ఈ మాజీ ప్రజాప్రతినిధికీ కమీషన్ల వరద పారింది. గుమ్మఘట్ట, డి హీరేహాళ్, కణేకల్లు ప్రాంతాల్లో జరిగిన అనేక పనులకు ఆనవాళ్లే లేవంటే దోపిడీ తీరు అర్థం చేసుకోవచ్చు. ⇒అప్పట్లో కణేకల్లు చిక్కణ్ణేశ్వర చెరువు పూడికతీత కోసం రూ.2 కోట్లను కేటాయించారు. ఈ పనులనూ కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రకు చెందిన ఎస్ఆర్సీ కంపెనీకే అప్పగించారు. సరిగ్గా వారం రోజుల పనులయినా చేయకముందే చెరువులోకి హెచ్ఎల్సీ నీరొచి్చచేరింది.నీరు నిండిపోవడంతో అరకొరగా చేసిన పనులు కనిపించలేదు. పక్కా ప్లాన్తోనే నీరొదిలి రెండు దుర్గాల నుంచి పోటీ చేస్తున్న టీడీపీ నేతలు కలసి రూ.2 కోట్లను దిగమింగారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ నిధులతోనే ఈ మాజీ ఎమ్మెల్యే విలాసవంతమైన భవనం కట్టుకున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ⇒టీడీపీ పాలనంతా అవినీతి, నిధుల మేతగా సాగినా... నేడు ఈ మాజీ ఎమ్మెల్యే నీతిమంతుడిలా బిల్డప్ ఇస్తున్నారు. ఇలాంటి వ్యక్తులకు మళ్లీ పట్టం కడితే రెండింతల అవినీతి తప్పదని స్థానిక ప్రజలు మాజీమంత్రిపై నమోదైన కేసుల వివరాలు.. ⇒19–04–2014న ఎంసీసీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడడంతో .. ఐపీసీ 188 సెక్షన్ కింద కేసు నమోదయింది. (క్రైమ్ నంబర్ –157/ 2014) ⇒27–04–2014 న ఎంసీసీ ఉల్లంఘన పై ఐపీసీ 188 సెక్షన్ కింద మరో కేసు నమోదయింది. క్రైమ్ నంబర్ – 188/14 ⇒14–03–2020న మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ విషయంలో అనుచరులతో కలిసి ఈ మాజీ ఎమ్మెల్యే .. కార్యాలయంలో దౌర్జన్యం చేశారు.. ఈ విషయంపై ఐపీసీ 343, 506 సెక్షన్ల కింద ఆర్పీ యాక్ట్ కేసు నమోదయింది. క్రైమ్ నంబర్ 88/20 ⇒07–12–2021న ఓ యాక్సిడెంట్ కేస్ విషయంలో.. శవ రాజకీయం నిర్వహిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టిన విషయంపై.. ఐపీసీ 341, 188ల సెక్షన్ల కింద కేసు నమోదయింది. క్రైమ్ నంబర్ 525/21. ⇒27–11–2022 న చెన్నేకొత్తపల్లి వద్ద టీడీపీ నిర్వహించిన ధర్నాకు ఈ మాజీ ఎమ్మెల్యే ఎలాంటి అనుమతులు లేకుండా పాల్గొనేందుకు వెళ్లే ప్రయత్నం చేశారు.. పోలీసులు అడ్డుకోవడంతో.. రోడ్డుపై ధర్నా చేస్తూ రాద్ధాంతం చేశారు. ఈ ఘటనపై ఐపీసీ 188, 341 సెక్షన్ల కింద కేసు నమోదయింది. క్రైమ్ నంబర్ 330/ 22 ⇒16–09–23 న చంద్రబాబు స్కిల్స్ స్కామ్ అరెస్టుపై అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహిస్తూ.. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించడంపై.. ఐపీసీ 143, 188, 341 ల సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. క్రైమ్ నంబర్ 157/23 ⇒ 27–09–2023 న స్కిల్ స్కామ్ కేసులో మరో ర్యాలీ చేపట్టడంతో.. ఐపీసీ 143, 188, 341 సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేశారు.. క్రైమ్ నంబర్ 165/23 ⇒28–08–23న స్కిల్ స్కాం కు నిరసనగా ర్యాలీలు, నిరసనలు పోలీసు నిబంధనలకు విరుద్ధంగా చేపట్టడంతో.. ఐపిసి 143, 188, 341 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. క్రైమ్ నంబర్ 167/23 ⇒ 08–10–2023న మళ్లీ అవే సెక్షన్ల కింద కేసు నమోదయింది. ఈ (9 కేసులు.. రాయదుర్గం అర్బన్ పీఎస్ లో నమోదు) క్రైమ్ నంబర్ 167/23 ⇒ 02–04–2024న బొమ్మనహళ్ మండలం ఉంతకల్లులో ఎంసీసీ కోడ్ నిబంధనలకు విరుద్ధంగా.. ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించడంతో.. బొమ్మనహళ్ పీఎస్ పరిధిలో.. 188, 341 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. క్రైమ్ నంబర్: 64/24
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హైదరాబాద్లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
మరో మహిళతో రొమాన్స్.. చాలా ఎగ్జైట్ అయ్యానన్న సోనాక్షి
‘రైతుల భూ డాక్యుమెంట్లను బుగ్గిపాలు చేసింది బాబేగా!’
ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్
తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వరంగల్ను BRS, కాంగ్రెస్ బారి నుంచి కాపాడాలి: ప్రధాని మోదీ
కొవిషీల్డ్ వ్యాక్సిన్ను రద్దు చేసిన ఆస్ట్రాజెనెకా.. కారణం తెలుసా..
పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు
పవన్ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు?: పోసాని
Photos
View allVideo
View allతప్పక చదవండి
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటేయవచ్చు!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement