కౌలు రైతు ఆత్మహత్య | Farmer commits suicide | Sakshi
Sakshi News home page

కౌలు రైతు ఆత్మహత్య

Oct 30 2015 4:42 PM | Updated on Nov 6 2018 7:56 PM

పెట్టుబడికి తెచ్చిన అప్పు తీర్చే దారి కానరాక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

పాములపాడు (కర్నూలు) : పెట్టుబడికి తెచ్చిన అప్పు తీర్చే దారి కానరాక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా పాములపాడు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న తులసీ నాయక్ గ్రామానికి చెందిన రైతు నుంచి 25 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని మిరప సాగు చేస్తున్నాడు.

ఈ క్రమంలో గింజలు సరిగ్గా మొలకెత్తకపోవడంతో.. రెండోసారి విత్తనాలు నాటాడు. అయినా ఆశించిన స్థాయిలో పంట లేకపోవడంతో.. పెట్టుబడుల కోసం తెచ్చిన రూ. 5 లక్షల అప్పుతో పాటు భూమి గుత్తకు తీసుకున్న రూ. 4 లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement