దగ్గుబాడు (కారంచేడు) : వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో రోడ్డు పక్కన పంట కాలువలో బోల్తా కొట్టడంతో 12 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన పోతినివారిపాలెం-దగ్గుబాడు గ్రామాల మధ్య శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని స్వర్ణ గ్రామానికి చెందిన సుమారు 30 మంది వ్యవసాయ కూలీలు ఆదే గ్రామానికి చెందిన దాసరి నరసింహారావు టాటా ఏస్ ఆటోలో కూలి పనుల కోసం దగ్గుబాడు వైపు వెళ్తున్నారు.
పోతినివారిపాలెం-దగ్గుబాడు గ్రామాల మధ్య వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో ఆటోకు కూలీలు ప్రయాణిస్తున్న టాటా ఏస్ ఆటో సైడ్ ఇవ్వబోయి మార్జిన్లో దిగి అదుపుతప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో డ్రైవర్తో పాటు తిరుమలశెట్టి నర్సమ్మ, నీరుకట్టు సుందరరావమ్మ, లక్కాకుల సుబ్బులు, గొనసపూడి రాముడు, ఇళ్ల అరుణ, తిరుమలశెట్టి పుష్పావతి, రమాసుందరి, భూపతి సామ్రాజ్యం, బండి సోని, చింతపల్లి వరలక్ష్మి, గలబ కోటేశ్వరమ్మలకు గాయాలయ్యాయి.
దగ్గుబాడు సర్పంచ్ ముల్లా నూర్అహ్మద్, పోతినివారిపాలెం సర్పంచ్ ధర్మా 108 సిబ్బందికి సమాచారం అందించారు. పర్చూరు, చీరాలకు చెందిన 108 వాహనాల్లో క్షతగాత్రులను చీరాలలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రుల్లో ఎక్కువ మందికి తల, నడుము, చేతులు, కాళ్లు, ఛాతీ భాగాల్లో పైకి కనిపించని దెబ్బలు తగిలాయని స్థానికులు చెబుతున్నారు. క్షతగాత్రులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీటీసీ సభ్యుడు నీరుకట్టు వాసుబాబు, సర్పంచ్ కట్టా లక్ష్మణబాబు పరామర్శించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు.
వ్యవసాయ కూలీల ఆటో బోల్తా
Published Sat, Feb 28 2015 4:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement