గవర్నర్‌కు నిమ్స్‌లో వైద్య పరీక్షలు | ESL Narasimhan visits NIMs Hospital | Sakshi
Sakshi News home page

గవర్నర్‌కు నిమ్స్‌లో వైద్య పరీక్షలు

Mar 7 2014 8:54 PM | Updated on Sep 4 2018 5:07 PM

గవర్నర్‌కు నిమ్స్‌లో వైద్య పరీక్షలు - Sakshi

గవర్నర్‌కు నిమ్స్‌లో వైద్య పరీక్షలు

గవర్నర్ నరసింహన్ శుక్రవారం నిమ్స్ ఆసుపత్రిలో సాధారణ వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ శుక్రవారం నిమ్స్ ఆసుపత్రిలో సాధారణ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఉదయం 9 గంటలకు ఆస్పత్రికి వచ్చిన ఆయనకు 11.35 దాకా వైద్యులు పలు పరీక్షలు జరిపారు. నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్‌తో పాటు డాక్టర్ సుభాష్ కౌల్, డాక్టర్ రామ్మూర్తి, డాక్టర్ జ్యోత్స్న, డాక్టర్ లిజా రాజశేఖర్ గవర్నర్‌కు వైద్య సేవలు నిర్వహించారు.

నిమ్స్ పాత భవనంలో సిటీ స్కాన్, కొత్తగా కట్టిన స్పెషాలిటీ బ్లాక్ నాలుగో అంతస్తులో పల్మనరి ఫంక్షన్ టెస్ట్ (పీఎఫ్‌టీ) జరిగాయి. సాధారణ రక్త పరీక్ష తదితరాలు కూడా జరిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement