ముగిసిన అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పరీక్ష | Ended Assistant Public Prosecutor Exam | Sakshi
Sakshi News home page

ముగిసిన అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పరీక్ష

Nov 17 2019 6:21 PM | Updated on Nov 17 2019 8:27 PM

Ended Assistant Public Prosecutor Exam - Sakshi

సాక్షి, విజయవాడ: పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ విభాగంలో 50 అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకానికి ఆదివారం నిర్వహించిన రాత పరీక్ష  ప్రశాంతంగా ముగిసింది. సెప్టెంబర్‌ 30న రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేయగా, ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతాల్లోని ఆరు సెంటర్లలో పరీక్ష ముగిసింది. పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ ని వెబ్‌సైట్‌లో అందుబాటులో  ఉంచారు. ఈ నెల 20 వరుకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్‌ విధానం ద్వారా సేకరించిన వివరాలను, మిగతా ఎంపిక ప్రక్రియలో కూడా బోర్డు ఉపయోగించనుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్  తో పాటు 52 పరికరాల ద్వారా బయోమెట్రిక్ వివరాలు నిక్షిప్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement