పరిగి, న్యూస్లైన్: తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్యే హరీశ్వర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాత్రి మండల కేంద్రంలోని టీటీడీ క ళ్యాణ మండపంలో తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కేతావత్ లక్ష్మణ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు డిప్యూటీ ఈఓ హరిశ్చందర్, ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంచందర్, టీజీయూఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబర్సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణలో అతిపెద్ద సంఘంగా టీజీయూఎస్ ఎదుగుతుందని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబర్సింగ్, జిల్లా అధ్యక్షుడు కేతావ త్ లక్ష్మణ్, ప్రధానకార్యదర్శి తిమ్యానాయక్ పేర్కొన్నారు. ఎస్టీలకు జిల్లా యూనిట్గా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
గిరిజన జాతి పేరుతో రిజర్వేషన్లు అనుభవిస్తున్నవారు జాతి అభివృద్ధికోసం, తండాల బాగుకోసం పాటు పడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మెడలువంచి హక్కులు సాధించుకుంటామన్నారు. ఓటు అనే ఆయుధంతో డిమాండ్లు నెరవేర్చుకుంటామన్నారు. ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి(డీసీటీఓ) రాంచందర్ మాట్లాడుతూ.. సంఘాలు ఎన్ని కార్యక్రమాలు చేపడితే అంత బలోపేతమవుతాయన్నారు. గు ర్తింపు అడుకుంటే వచ్చేది కాదు... అది సా ధించుకోవాలన్నారు. మనం చేసే పనులే మ నకు గుర్తింపు తెచ్చిపెడతాయన్నారు. ఇతర గిరిజన ఉద్యోగులు, సంఘాలు, మేధావుల సలహాలు సూచనలు తీసుకుని టీజీయూఎస్ను మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు. సంఘం సమస్యలతో పాటు తండాల్లోని ప్రజల సమస్యలు పట్టించుకోవాలన్నారు. డిప్యూటీఈఓ హరిశ్చందర్ మాట్లాడుతూ.. తండాల్లో వెనుకబడిన వారికోసం కృషి చేద్దామన్నారు. కార్యక్రమంలో టీజీయూఎస్ , జిల్లాకు చెందిన ఆయా పాఠశాలల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గోపాల్, రాములు, వెం కట్, హరిలాల్, రూప్సింగ్, టీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్రెడ్డి, బాబాయ్య పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులదే కీలకపాత్ర
Published Thu, Jan 9 2014 12:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
Advertisement