రాజకీయాల్లోకి మరో వారసురాలొస్తోంది! | Damodara Rajanarasimha wife Padmini likely to contest polls | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోకి మరో వారసురాలొస్తోంది!

Feb 23 2014 3:57 PM | Updated on Mar 19 2019 9:20 PM

రాజకీయాల్లోకి మరో వారసురాలొస్తోంది! - Sakshi

రాజకీయాల్లోకి మరో వారసురాలొస్తోంది!

అపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిణి రాజకీయ అరంగేట్రం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

హైదరాబాద్: భార్యాభర్తలు, అన్నాదమ్ములు, తండ్రీకొడుకు ఇలా ఒకే కుటుంబానికి చెందిన వారు రాజకీయాల్లో ఉండటం కొత్తేమీ కాదు. ఒకేసారి చట్టసభలకు కూడా ఎన్నికయ్యారు. తాజాగా రాష్ట్రంలో (తెలంగాణ) మరో రాజకీయ వారసురాలు తెరపైకి రానుంది. అపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిణి రాజకీయ అరంగేట్రం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పలు సేవాకార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆమె.. ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలనుందని ఆదివారం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో మెదక్ జిల్లా సంగారెడ్డి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు పద్మిణి చెప్పారు.

సంగారెడ్డి నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపునే జగ్గారెడ్డి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా పద్మిణి జగ్గారెడ్డిపై విమర్శలు కురిపించారు. వచ్చే ఎన్నికల్లో పోలీంగ్ బూతులు ఆక్రమిస్తానని జగ్గారెడ్డి తీవ్రమైన వ్యాఖ్యాలు చేశారని, ఇవి ఎంత వరకు సబబో జిల్లా ప్రజలు ఆలోచించాలని ఆమె అన్నారు. ఆయనపై పార్టీ అధిష్టానికి, ఈసీకి, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement