వైఎస్ఆర్సీపీ విజయం తథ్యం
ఆత్మకూరు,
రాష్ట్రం సమైక్యంగా ఉన్నా విడిపోయినా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమని ఆపార్టీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా రాజశేఖర్రెడ్డి అన్నారు. పట్టణంలో శనివారం గడపగడపకూ వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో రాష్ట్ర విభజనపై జరుగుతున్న విధానం చూస్తుంటే ప్రతి ఒక్కరికీ ఆందోళన కలిగించే రీతిలో ఉందన్నారు. సొంత పార్టీకి చెందిన నాయకులే విభజన విషయంలో గందరగోళ పరిస్థితి కల్పించి సీమాంధ్ర ప్రజాప్రతినిధులను ఇబ్బందులకు గురిచేశారన్నారు. పార్లమెంట్ సభ్యులుగా కనీసం గౌరవ మర్యాదలు పాటించకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా కొందరు సభ్యులు ఆందోళన చేయడం జరిగిందన్నారు. కొన్నేళ్లుగా కలిసి మెలిసి ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను విడదీడయం సరికాదని సాగునీరు, తాగునీరు, విద్య, ఆర్థిక పరిస్థితులు సీమాంధ్రకు తీరని అన్యాయం జరుగుతుందని పదేపదే ప్రజా ప్రతినిధులు చెబుతున్నా కాంగ్రెస్ పార్టీ పెడచెవిన పెట్టి ఓట్ల కోసం విభజించడం సరికాదన్నారు. పార్లమెంట్లో సీమాంధ్ర మంత్రులకు, పార్లమెంట్ సభ్యులకు రక్షణ కరువైందని చెప్పారు. రెండు ప్రాంతాలకు చెందిన ప్రజలను చంద్రబాబు మోసం చేశాడని, అలాగే అన్నీ ఫ్రీ అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిచోటా వైఎస్ఆర్సీపీకి జనం నీరాజనం పలుకుతున్నారని, ప్రజా సంక్షేమాలకు పాటుపడిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయాలను, ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే ఒక్క జగన్తోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలోని తెలుగుజాతి ఒక్కటేనని నిరూపించేందుకు ఈనెల 17న ఢిల్లీలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన క్షణంలోనే తాను రాజీనామా చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ప్రకటించారని అయితే బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి రెండు రోజులు గడిచినా ఇంతవరకూ రాజీనామా చేయకపోవడం చూస్తుంటే ప్రజల్లో ఎవరు మోసగాళ్లో స్పష్టమవుతుందని చెప్పారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మహబూబ్బాషా, జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
శ్రీశైలం నియోజకవర్గం అభివృద్ధే తన లక్ష్యమని వైఎస్ఆర్సీపీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని 12, 15 వార్డులలో శనివారం ఆయన గడపగడపకూ వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో తీవ్ర మంచినీటి ఎద్దడితో పలు గ్రామాలు ఆత్మకూరు, శ్రీశైలం, సున్నిపెంటలలో ప్రజలు తీవ్ర దాహార్తిని ఎదుర్కొంటున్నారన్నారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులు కేవలం హామీలు ఇవ్వడం మినహా ప్రజా సమస్యలు పట్టించుకోరని విమర్శించారు. ఏడేళ్లుగా వెలుగోడు రిజర్వాయర్ నుంచి ఆత్మకూరు పట్టణానికి మంచినీటి సౌకర్యం కల్పించడంలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మహబూబ్బాషా, వరాల మాలిక్, జయకృష్ణ, నాగూర్, అంజాద్అలీ, మోతుల్లా, యుగంధర్రెడ్డి, నాగార్జునరెడ్డి, తిమ్మయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ఆర్సీపీ విజయం తథ్యం
Published Sun, Feb 16 2014 12:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మహిళలు వ్యాపారాల్లో రాణించాలి
అభివృద్ధే ప్రధాని మోదీ లక్ష్యం
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
సీత్యతండాలో అగ్ని ప్రమాదం
ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
కాంగ్రెస్, బీఆర్ఎస్ను భూస్థాపితం చేయాలి
Lok sabha elections 2024: ఢిల్లీ గల్లీలు...ఎవరివో!
దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
సరెండర్ చేసినా కుర్చీ వదలరు
బైక్తో సహా బావిలో పడి రైతు మృతి
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement