రిమాండ్‌ రిపోర్ట్‌పై సీఎం సమీక్ష! | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 28 2018 2:14 PM

CM Chandrababu Naidu Meets Intelligence Chief Venkateswara Rao - Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి ముమ్మాటికీ హత్యాయత్నమేనని రిమాండ్‌ రిపోర్ట్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని తేలాయి. వైఎస్‌ జగన్‌ అప్రమత్తంగా లేకుంటే కత్తి గొంతులో దిగేదని రిమాండ్‌ రిపోర్ట్‌ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆదివారం ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ వెంకటేశ్వరావుతో అత్యవసరంగా భేటి అయ్యారు.

ఈ రిపోర్ట్‌పై సమీక్ష జరుపుతున్నారు. మరోవైపు కాకినాడలో సీబీఐని కుదిపేసిన సానా సతీష్‌పై సోదాలు నిర్వహించడం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఏపీ పోలీసులు తెలంగాణలో డబ్బులతో పట్టుబడటంపై కూడా చర్చించినట్లు సమాచారం.

చదవండి: వైఎస్‌ జగన్‌పై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమే!

Advertisement

తప్పక చదవండి

Advertisement