‘రైతుకు చిక్కిన వజ్రం’పై విచారణ

గుత్తి రూరల్: బేతాపల్లిలో ఓ రైతుకు విలువైన వజ్రం చిక్కిందన్న విషయం వెలుగులోకి రావడంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు శుక్రవారం విచారణ చేపట్టారు. ‘రైతుకి చిక్కిన రూ.కోటి వజ్రం’, ‘రూ.30 లక్షలకు విక్రయం’ అనే శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన కథనానికి తహసీల్దార్ బ్రహ్మయ్య, సీఐ రాజశేఖర్రెడ్డి స్పందించి విచారణకు ఆదేశించారు. వజ్రం చిక్కిన రైతు అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులను విచారించారు. కొనుగోలు చేసిన వ్యాపారి, మధ్యవర్తులను తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించుకుని విచారించారు. వజ్రం ఎప్పుడు, ఎక్క డ చిక్కింది.. ఎంతకి విక్రయించారు? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. అయితే వజ్రం చిక్కినట్లు రైతు కుటుంబీకులు ఒప్పుకోగా.. కొనుగోలు చేసిన వ్యాపారి మాత్రం తాను ఎలాంటి వజ్రమూ కొనుగోలు చేయ లేదని అధికారులతో చెప్పాడు.(వృద్ధుడిని బంధించి.. విలువైన వజ్రం అపహరణ )
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి