జ్ఞాపక శక్తి కోల్పోయిన చంద్రబాబు:శోభానాగిరెడ్డి | Chandrababu Naidu Memory loss: Sobhanagireddy | Sakshi
Sakshi News home page

జ్ఞాపక శక్తి కోల్పోయిన చంద్రబాబు:శోభానాగిరెడ్డి

Aug 14 2013 2:32 PM | Updated on Sep 1 2017 9:50 PM

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జ్ఞాపక శక్తి కోల్పోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు.

కర్నూలు: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జ్ఞాపక శక్తి కోల్పోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. అప్పుడు విభజనన్న బాబు కొత్త రాజధానికి 4 లక్షల కోట్ల రూపాయలు అడిగారు,  ఇప్పుడు యూటర్న తీసుకుని  సమైక్యాంధ్ర అంటున్నారన్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనపై చంద్రబాబు కపట నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

పాలమూరు లిప్ట్ ఇరిగేషన్ సర్వేకు జీవో 72ను విడుదల చేశారు. ఈ  జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిగులు జలాలపై ఆధారపడుతున్న రాయలసీమను ఆదుకోవాలని కోరారు. జీవో వెనక్కి తీసుకునేంతవరకు రాయలసీమ మంత్రులు ప్రతాపరెడ్డి, టిజి వెంకటేష్లను నిలదీయాలన్నారు. రాయలసీమకు నీళ్లు అందేంతవరకు వైఎస్ఆర్ సీపీ  న్యాయపోరాటం చేస్తుందని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement