చిత్తూరు జిల్లా మదనపల్లి మునిసిపల్ చైర్మన్ కారు డ్రైవర్పై పోలీసుల......
మదనపల్లి రూరల్: చిత్తూరు జిల్లా మదనపల్లి మునిసిపల్ చైర్మన్ కారు డ్రైవర్పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మునిసిపల్ చైర్మన్ కడవలి శివప్రసాద్ కారు డ్రైవర్గా పనిచేస్తున్న రెడ్డి శేఖర్ (28)తనపై చేయి చేసుకోవడంతోపాటు వేధింపులకు పాల్పడినట్టు దిగువకమ్మపల్లి గ్రామానికి చెందిన లైన్మెన్ బాలకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో రెడ్డిశేఖర్పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.